కొన్ని సంవత్సరాల క్రితం వెంకటేష్ , మహేష్ బాబు హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మల్టీ స్టారర్ మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాను అంతా కొత్తవాళ్లతో తీయాలి అనుకున్నారు. కానీ స్టార్ హీరోలతో తీశారు. అసలు ఏం జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం. కొంత కాలం క్రితం ఈ సినిమా నిర్మాత అయినటువంటి దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... శ్రీకాంత్ అడ్డాల "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాకు సంబంధించిన కొంత లైన్ ను నాకు చెప్పాడు.

అది నాకు చాలా బాగా అనిపించింది. దానితో వెంటనే ఈ సినిమా చేద్దాం అని అన్నాను. కానీ ఎవరితో చేద్దాం అని నేను ఆయనను అడిగాను. దానితో ఆయన అంతా కొత్త వాళ్ళతో చేద్దాం అనుకుంటున్నారు సార్ అని చెప్పాడు. దానితో నేను ఇది అంతా కొత్త వాళ్ళతో అయితే ఈ కథ వర్క్ అవుట్ కావడం కష్టం ... స్టార్ హీరోలతో ఈ సినిమా చేద్దాం అన్నాను. దానితో ఆయన వెంకటేష్ నాతో ఎప్పటి నుండో టచ్ లో ఉన్నాడు సార్. ఈ కథ కూడా విన్నాడు ... చేయడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పాడు. ఇక దానితో మనం నెక్స్ట్ ఆప్షన్ గా పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో వెళ్దాం అన్నాను.

ఇక పవన్ కళ్యాణ్ ను కలవక ముందే ఒకానొక సమయంలో అనుకోకుండా నేను మహేష్ బాబు ను కలిశాను. ఈ సినిమా పాయింట్ చెప్పాను. దానితో ఆయన కూడా ఈ స్టోరీ తో సినిమా చేయడానికి చాలా ఎగ్జాక్ట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే కథ విన్నాడు. ఆయన కూడా ఈ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అలా అంతా కొత్త వాళ్ళతో అనుకున్న ఈ సినిమాలోకి ఏకంగా వెంకటేష్ , మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు వచ్చారు అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: