బిగ్ బాస్ తెలుగు సీజన్ -8 ఇప్పుడు ఆరో వారాలకు చేరుకున్నది. ఇప్పటికే 5 మంది కంటెస్టెంట్స్ సైతం ఎలిమినేట్ కావడం జరిగింది. ఇప్పుడు ఆరో వారం నామినేషన్ ప్రక్రియ కూడా దగ్గర పడుతున్న కొద్ది హౌస్ లోని కంటెస్టెంట్స్ కూడ కాస్త ఆందోళన చెందుతున్నారు. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన పాత కంటెస్టెంట్స్ కూడా కొత్త వారి పైన గురి పెట్టారు.ఒక్కొక్కరి తప్పులను చెబుతూ నామినేట్  చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే తమిళంలో అక్టోబర్ 6న ఎనిమిదవ సీజన్ ప్రారంభమైనది. దీనికి హోస్టుగా విజయ్ సేతుపతి చేశారు.


ఈసారి హౌస్ లో సీనియర్ నటీనటులతో పాటు చాలామంది యంగ్ సెలబ్రిటీలు కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. కంటెస్టెంట్ హౌస్ లోకి అడుగుపెట్టిన కేవలం 24 గంటలు పూర్తికాకముందే ఒకరిని ఎలిమినేట్ చేయడం జరిగింది. తాజాగా విడుదలైన ప్రోమోలో మొదటి రోజు ఎవరు ఎలిమినేట్ అయ్యారనే విషయాన్ని చూపించడం జరిగింది. అందులో కోలీవుడ్ నటి సచిన్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె ఒక్కసారిగా ఏడుస్తూ హౌస్ నుంచి బయటికి వచ్చేసిన విజువల్స్ చూపించారు.


అయితే ఈ అమ్మాయి ఇప్పుడిప్పుడే కోలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకుంటోంది.ముఖ్యంగా విజయ్ సేతుపతి నటించిన మహారాజ చిత్రంలో కూడా ఈమె నటించింది. మహారాజ సినిమాతో తెలుగు తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సచన ఇప్పుడు హౌస్ లోకి అడుగుపెట్టిన ఒక్కరోజే బయటకి వెళ్లినట్టు అయిందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కనీసం ఒక వారం కూడా గొడవకు ముందు ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ పలువురు ఆడియన్స్ ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వన్డే ఎలిమినేషన్ వెనుక ఏదైనా ప్లాన్ ఉందా అంటూ మరి కొంతమంది ఆడియన్స్ ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: