హనుమాన్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఎలాంటి అంచనాలు లేకుండా రూపొందించిన ఓ చిన్న సినిమాను ఈ ఏడాది సంక్రాంతి కానుకగా స్టార్ హీరోలకు పోటీగా రిలీజ్ చేసి హిట్టు కొట్టాడు. యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని రెస్పాన్స్ అందుకుంది. ప్రశాంత్ వర్మ మేకింగ్, విజువల్ ఎఫెక్ట్ చూసి ఫిదా అయ్యారు అడియన్స్. దీంతో హనుమాన్ సెకండ్ పార్ట్ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇందులో నటీంచే యాక్టర్స్ ఎవరెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ

 హనుమాన్ పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే ఇప్పుడు నటసింహం బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ్య తేజని ఇండస్ట్రీకి తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి పరిచయం చేయబోతున్నాడు. అయితే తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి సాలిడ్ అప్డేట్ ని తాను అందించాడు.ఈ దేవి నవరాత్రుల సమయంలోనే ఈ అక్టోబర్ 10న తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మూడో సినిమాని అనౌన్స్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు. మరి ఆ సినిమా ఏంటి అనేది ఆరోజు తెలియనుంది. ప్రస్తుతం అయితే జై హనుమాన్, మోక్షజ్ఞ్య సినిమాలతో తాను బిజీగా ఉన్నాడు. ఈ దేవి నవరాత్రుల

 సమయంలోనే ఈ అక్టోబర్ 10న తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మూడో సినిమాని అనౌన్స్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు.  హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈయన కోసం చాలా మంది స్టార్ హీరోలు క్యూలో నిలబడ్డారు. అన్నింటికీ మించి నందమూరి వారసుడిని పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు ఈ దర్శకుడు. ఇక PVCUలో భాగంగా మొదటి సినిమాను ఆంజనేయుడిపైనే తెరకెక్కించి అద్బుతం చేసారు ఈ దర్శకుడు. ఈ యూనివర్స్‌లో ఇంకా చాలా సినిమాలు రాబోతున్నాయని ఇప్పటికే ప్రకటించారు ప్రశాంత్ వర్మ...!!

మరింత సమాచారం తెలుసుకోండి: