తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖపై అక్కినేని నాగార్జున మరోసారి రెచ్చిపోయి మాట్లాడారు. తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సిందేనని అంటూ అక్కినేని నాగార్జున కామెంట్స్‌ చేశారు. ఇవాళ నాంపల్లి కోర్టుకు అక్కినేని నాగార్జున హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున వాంగ్మూలాన్ని కోర్టు జడ్జి రికార్డు చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున తన బాధను మొత్తం కక్కేశారు.

అక్కినేని నాగార్జున వాంగ్మూలం ప్రకారం...  సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని అక్కినేని నాగార్జున  పేర్కొన్నారు. మా కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయని చెప్పారు.  జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని.. కోర్టు కు వివరించారు అక్కినేని నాగార్జున. సినిమా రంగం తో పాటు సామజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నామని కూడా కోర్టుకు వివరించారు.

మా కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వలన అంటూ మంత్రి అసభ్యంగా మాట్లాడారని ఆగ్రహించారు అక్కినేని నాగార్జున. అలా మాట్లాడం వలన మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని ఫైర్‌ అయ్యారు నాగార్జున. మంత్రి కొండా సురేఖ ఫై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు అక్కినేని నాగార్జున. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అన్ని కూడా అసత్య ఆరోపణలు అని తెలిపారు అక్కినేని నాగార్జున.

రాజకీయ దురుద్దేశ్యం తోనే మంత్రి ఇలాంటి వాఖ్యలు చేసిందని కోర్టుకు తెలిపారు. ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న  తన కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైందన్నారు. మంత్రి మాట్లాడిన మాటలు అన్ని టెలివిజన్ ఛానెల్స్ లో ప్రసారం చేసాయని కూడా తెలిపారు. అన్ని పేపర్స్ ప్రచురితం చేసాయన్నారు. దీని వలన మా కుటుంబం  తీవ్ర మనోవేదనకు గురైందని కూడా తెలిపారు నాగార్జున.. అందుకే ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు అక్కి నేని నాగార్జున.

మరింత సమాచారం తెలుసుకోండి: