పాపం తాను ఒకటి తలుచుకుంటే దైవం మరొకటి తలచింది అన్నట్లు అక్కినేని నాగార్జున పరిస్థితి ప్రెసెంట్ ఎంత దారుణంగా మారిపోయిందో మనం చూస్తూనే ఉన్నాము. ఈ మధ్యకాలంలో అక్కినేని నాగార్జున ను, అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ ను సోషల్ మీడియాలో జనాలు ఎక్కువగా ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా హీరోయిన్ సమంత కి నాగచైతన్య విడాకులు ఇచ్చేసినప్పటినుంచి అక్కినేని కుటుంబ సభ్యులను బాగా హద్దులు మీరిన రేంజ్ లో ట్రోలింగ్ కి గురిచేస్తున్నారు కొందరు ఆకతాయిలు.

అయితే ఇప్పటివరకు ఎప్పుడు కూడా నాగార్జున ఆ ట్రోలింగ్ పై స్పందించింది లేదు ..వాళ్లను తప్పుపడుతూ మాట్లాడింది లేదు.  తన పని తాను చూసుకుంటూ వచ్చాడు. నాగచైతన్య కూడా అంతే సమంతకు విడాకులు ఇచ్చేసిన తర్వాత ఆ మేటర్ లో అసలు వేలే పెట్టలేదు . అయితే అందరికీ షాక్ ఇస్తూ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్ధం చేసుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . అప్పుడు కూడా చాలామంది నాగచైతన్య ను ట్రోల్ చేశారు . కానీ నాగచైతన్య - నాగార్జున ఏ మాత్రం పట్టించుకోలేదు .

అయితే రీసెంట్గా మంత్రి కొండా సురేఖ ..నాగచైతన్య - సమంత విడాకుల్లో కేటీఆర్ హస్తం ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేసింది . అంతేకాదు కేటీఆర్ కు సమంత పై కన్ను అన్న విధంగా మాట్లాడుతూ అక్కినేని కుటుంబంపై మోపరాని నింద మోపేసింది . ప్రజెంట్ ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్  గా ట్రెండ్ అవుతుంది. అయితే ఇదే మూమెంట్లో మళ్ళీ అక్కినేని ట్రోలర్స్ యాక్టివాయ్యారు . రీసెంట్ గానే నాగార్జునకు వందల కోట్లు సంపాదించిపెట్టే ఎన్ కన్వెన్షన్ హాల్ ను గవర్నమెంట్ కూల్చేసిన  విషయం తెలిసిందే . ఆ టైంలో కొత్త కోడలి రాకతో అక్కినేని ఇంటికి శని ఎంట్రీ ఇచ్చింది అంటూ దారుణాతి దారుణంగా ట్రోల్ చేశారు .

ఇప్పుడు ఏకంగా ఎప్పుడు లేని విధంగా అక్కినేని కుటుంబం పై ఇలాంటి చెత్త నింద రావడంతో అందరి కళ్ళు ఇప్పుడు శోభిత ధూళిపాళ్లపైనే పడ్డాయి.  సమంత లాంటి మంచి అమ్మాయిని వదులుకొని శోభిత లాంటి అమ్మాయికి లైఫ్ ఇవ్వాలి అనుకున్న నాగచైతన్యకు ..దాన్ని సపోర్ట్ చేసిన నాగార్జునకు ఇలా అవ్వాల్సిందే ..కొత్తకోడలు రాకతో మరిన్ని కష్టాలు మీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాయి అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు కొంతమంది హద్దులు మీరుతూ శోభితా ధూళిపాళ్ల అక్కినేని కుటుంబానికి ఐరన్ లెగ్ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. ఇప్పుడు అక్కినేని నాగార్జున జరిగిన నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకుంటాడా..? ఇవన్నీ నాకెందుకులే జరగాల్సిన కర్మ ఎలాగో జరుగుతుంది అంటూ కొడుకుని శోభిత దూళిపాళ్లకి ఇచ్చి పెళ్లి చేస్తారా..? అనే విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . మొత్తానికి ముందు చూస్తే నూయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్న సామెత  నాగార్జునకి బాగా సెట్ అవుతుంది. చూద్దాం ఈ కష్టం నుంచి నాగార్జున ఎలా బయటపడతాడో..??

మరింత సమాచారం తెలుసుకోండి: