తాజాగా రాజ్ తరుణ్  "తిరగబడరా సామి" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మాల్వి మల్హోత్రా హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తోనే ఈ ముద్దు గుమ్మ తెలుగు తెరకు పరిచయం అయింది. ఇకపోతే ఈమె సినిమాల కంటే కూడా తన వ్యక్తిగత జీవితం ద్వారా ఎక్కువ పాపులర్ అయింది. దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం తనపై జరిగిన దాడి కేసులో ఈమె చాలా కాలం నుండి న్యాయం పోరాటం చేస్తుంది. ఇక తాజాగా ఈమె కేసుకు సంబంధించిన కోర్టు తీర్పు వెలువడింది. ఈ తీర్పు మాల్వి మల్హోత్రా కు అనుకూలంగా వచ్చింది.

దానితో ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ చివరికి న్యాయమే గెలిచింది అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇంతకు ఏం జరిగిందో తెలుసుకుందాం ... 2020 వ సంవత్సరంలో పెళ్లిన్కి నిరాకరించింది అని నటి మాల్వి మల్హోత్రా పై నిర్మాత యోగేష్ సింగ్ కత్తితో దాడి చేశాడు. వీరిద్దరూ ఫేస్ బుక్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా పరిచయం అయినట్లు అప్పటి నివేదికలు చెబుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఒక రోజు ముంబై లో రాత్రి పూట మాల్వి ని యోగేష్ సింగ్ అడ్డగించాడు. తనను దూరం పెడుతుంది అని , మాట్లాడటం లేదు అని ఆమెతో వాదించాడు.

ఇక ఆ తర్వాత కత్తితో దాడి చేసి అతను పారిపోయాడు. ఆ తర్వాత అతని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రోజు నుంచి మాల్వి న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉంది. ఎట్టకేలకు ఆమెకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఇకపోతే మాల్వి అందించిన సాక్షాదారాలను పూర్తిగా పరిశీలించిన ముంబై న్యాయస్థానం దాడి చేసిన యోగేష్ సింగ్ ను దోషిగా నిర్ధారించింది. అలాగే అతనికి మూడేళ్ల పాటు కఠిన కారాగార శిక్షను కూడా విధిస్తున్నట్లు కోర్టు తీర్పును వెల్లడించింది. ఇక ఈ తీర్పు తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని , చివరకు న్యాయమే గెలిచింది అని మాల్వి మల్హోత్రా సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్త పరిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: