ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణించిన గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట విలన్ పాత్రలలో నటించి ఆ తర్వాత హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడు శ్రీనువైట్ల, గోపీచంద్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వం'. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిచింది. హై బడ్జెట్ ఎంటర్టైనర్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనెపూడి చిత్రాలయం స్టూడియోస్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

దోనేపూడి చక్రపాణి ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో ఈ సినిమాపై మంచి బజ్ ను ఏర్పరిచాయి. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరోయిన్ కావ్య మాట్లాడుతూ విశ్వం సినిమా నాకు చాలా స్పెషల్. శ్రీను వైట్ల గారి హీరోయిన్ అనే ట్యాగ్ నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.

ఆయన సపోర్ట్ కి చాలా థాంక్స్. అతని నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. గోపీచంద్ సార్ తో పని చేయడం నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. అతనితో డ్యాన్స్ చేసే సమయంలో నేను చాలా ఎంజాయ్ చేశాను. వేణు గారు చాలా సపోర్ట్ చేశారు. అతనికి చాలా థాంక్స్. విశ్వం సినిమాకు ఆయన మెయిన్ పిల్లర్. ఫారెన్ షెడ్యూల్స్ అన్నీ కూడా ఆయన సపోర్ట్ తోనే విజయవంతమయ్యాయి.


గుహన్ గారు ఐ పీస్ట్ లాంటి విజువల్స్ ఇచ్చారు. సినిమాని నెక్స్ట్ లెవెల్ కి ఎలివేట్ చేసిన నిర్మాత విశ్వప్రసాద్ గారికి థ్యాంక్స్. అతను లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ హోమ్ ఫర్ మీ. ఈ సినిమా షూటింగ్ సమయంలో కొన్ని సీన్ల విషయంలో శ్రీనువైట్ల గారు నరకం చూపించారని తెలియజేసింది. ప్రస్తుతం కావ్య థాపర్ చేసిన వాక్యాలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: