యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో టాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే.తన సినిమాలతో వరుస విజయాలను అందుకుంటున్న ఈ హీరో ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టారు.తర్వాత సినిమాలతో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు.ఎన్టీఆర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో ఎన్టీఆర్ ఇప్పుడు వరుసగా మల్టీ స్టారర్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరోసారి తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఒక మల్టీస్టారర్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తమిళ్ స్టార్ హీరోయిన సూర్య, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే సూర్యతో ఒక సినిమా చేయాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్న లోకేష్ కనకరాజ్ ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని కూడా భాగం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ‘ కూలీ ‘ సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా అయిపోయిన తర్వాత ఈ భారీ మల్టీ స్టారర్ సినిమా అనౌన్స్ మెంట్ అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది… మరి దీని ద్వారా జూనియర్ ఎన్టీఆర్ మరింత మార్కెట్ ను పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.ఈ నేపథ్యంలో లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో పని చేయాలని టాలీవుడ్ హీరోలు సైతం ఆశ పడుతున్నారు.ఎన్టీఆర్ కు లోకేశ్ కనగరాజ్ లాంటి డైరెక్టర్ దొరికితే రచ్చరచ్చే అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మరి ఎన్టీఆర్డైరెక్టర్ పై దృష్టి పెడతారో లేదో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: