సౌత్ ఇండియాలోనే తనకంటూ ఒక బ్రాండ్ సంపాదించుకున్న నయనతార తన విలక్షణమైన నటితో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. నయనతార తన సినీ కెరియర్లలో ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొన్నది. ముఖ్యంగా ఆమె వ్యక్తిగత జీవితంతో పాటు మరిన్ని విమర్శలు ఎదుర్కొంది. అయితే ఇప్పుడు తాజాగా నిర్మాత, యూట్యూబర్ అయినటువంటి  అంతనన్ నయనతార పైన విమర్శలు చేయడం జరిగింది. ఎందుకో ఇప్పుడు ఒకసారి చూద్దాం.



ముఖ్యంగా నయనతార వ్యవహార శైలి పైన అందుకు సంబంధించి ఎన్నోసార్లు నిర్మాతలు సైతం చాలా అసంతృప్తిని తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో నయనతార ఒక సినిమా సెట్స్ ఫైకి 8 మందితో కలిసి వచ్చిందనే ఆరోపణలు కూడా ఎక్కువగా వినిపించాయి. ఈ విషయం పైన అంతనన్ మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. ఆమె ఇప్పుడు తన పిల్లలను చూసుకునేటువంటి ఆయాలను  కూడా సెట్స్ కు తీసుకువస్తోందనీ.. వారి యొక్క ఖర్చులను కూడా నిర్మాతనే భరించాలంటూ పలు రకాల ఆరోపణలు చేస్తోందంటూ ఫైర్ అయ్యారు ఈ నిర్మాత. నయనతార తన పిల్లలను చూసుకొని ఆయాలతో షూటింగ్ లొకేషన్స్కు రావడం వారి డబ్బులు చెల్లించాలని నిర్మాతల పైన ఒత్తిడి చేస్తోంది అంటూ తెలిపారు.


పిల్లల కోసం తీసుకువచ్చే ఆయాలను వారికి డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత నిర్మాతలది కాదు అంటూ అంతనన్ తెలియజేశారు. అది తన పర్సనల్ అని ఆమె ఇచ్చుకోవాలి అని ఫైర్ అయ్యారు. అంతేకాకుండా నయనతార జీవితంలో వ్యక్తిగత అంశాల పైన కూడా మాట్లాడుతూ ఆమె డబ్బు తీసుకోవడం కోసమే తన జీవితంలో కూడా చూస్తూ ఉంటుంది అంటూ విమర్శించారు. నయనతార తన పెళ్లిని నెట్ ఫ్లిక్ సంస్థకు భారీ మొత్తానికి అమ్మేసింది ప్రతిదీ కూడా వ్యాపారంగానే చూసుకుంటుంది అంటూ విమర్శించారు. ఆమె ఒక్కో చిత్రానికి రూ .12 కోట్లు తీసుకుంటుందట.. తన సినిమాలు బాగా ఆడనప్పుడు ఎందుకు అంత ఫీజు అంటూ నిర్మాత అంతనని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: