తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటీమణులలో సమంత ఒకరు. ఈమె ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తోనే ఈమె మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చాలా సినిమాలలోనే హీరోయిన్గా నటించింది. ఈమె మొదటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అత్తారింటికి దారేది సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

ఆ తర్వాత వీరి కాంబోలో "అ ఆ" ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత వీరి కాంబోలో సన్నాఫ్ సత్యమూర్తి అనే మూవీ వచ్చింది. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇలా వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా ఆలియా భట్ "జిగ్రా" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. దానితో నిన్న రాత్రి ఈ మూవీ బృందం తెలుగు లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది.

ఈవెంట్ కి త్రివిక్రమ్ , సమంత ముఖ్య అతిథులుగా వచ్చారు. అందులో భాగంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ ... సమంత గారు మీరు ముంబైలోనే ఉండకండి. హైదరాబాద్ కి కూడా రండి. మీరు సినిమాలు చేస్తారో ... లేదో అని మీకు మంచి పాత్రలు కూడా రాయడం లేదు. మీరు సినిమా చేస్తాను అంటే మంచి పాత్ర నేను మీకు రాస్తాను అని అన్నాడు. ఇక సమంత కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే సైగలు చేసింది. ఇలా సైలెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ , సమంత ను మరో సినిమాకు ఒప్పించినట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: