యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజా గా దేవర పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి మిక్స్ డ్ టాక్ వచ్చిన కూడా ప్రస్తుతం అదిరి పోయే రేంజ్ కలెక్షన్లను ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది . ఇక పోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హిందీ సినిమా అయినటు వంటి వార్ 2 లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్మూవీ లో హీరో గా నటించబోతున్నాడు.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ కి డ్రాగన్ అనే టైటిల్ ను మేకర్స్ అనుకుంటున్నట్లు ఆల్మోస్ట్ ఇదే టైటిల్ను కన్ఫామ్ చేయబోతున్నట్లు కూడా ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన సినిమాలలో ఉగ్రం మూవీ ని మినహాయిస్తే అన్ని సినిమాలు కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కే జి ఎఫ్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రెండు భాగాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.

ఇక సలార్ సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక భాగం ఇప్పటికే విడుదల అయ్యి మంచి విజయం అందుకోగా , మరో భాగం మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఇకపోతే ప్రశాంత్ , ఎన్టీఆర్ తో రూపొందించబోయే సినిమా విషయంలో మాత్రం ఈ ఫార్ములాను బ్రేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమాను కేవలం ఒకే భాగంలో తెరకెక్కించాలి అని ప్రశాంత్ భావిస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: