చిత్ర పరిశ్రమకు ఎంతో మంది హీరోయిన్లు వస్తున్నారు పోతున్నారు. వారిలో కొంతమంది మాత్రమే స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతున్నారు. ఇదే క్రమంలో గత సంవత్సరం సప్తసాగరాలు దాటి సైడ్ ఏ, బి సినిమాతో హిరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్ .. ఎలాంటి గ్లామర్ షో చేయకుండా తన నటనతో ఎంతో మంది అభిమానులను తెచ్చుకుంది. అలాగే తన క్యూట్ లుక్స్ తో పాటు పక్కింటి అమ్మాయిల అనిపించే అందం ఆమెకు అభిమానులను తెచ్చిపెట్టింది. అలాగే నటనకు ప్రాధాన్యత ఉండే సినిమాల్లో నటించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న రుక్మిణి వసంత్‌కు టాలీవుడ్ లో ఎంట్రీ కి సరైన ప్లానింగ్ తోనే వస్తుంది ఈ ముద్దుగుమ్మ. నిఖిల్‌తో చేసిన తన డబ్ల్యూ.. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఈ నెలాఖరుకు దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమా ఆమె ఎప్పుడో ఒప్పుకున్న సినిమా.


అయితే ఇప్పుడు అసలు కిక్కిచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఎన్టీఆర్ - ప్రశాంత్ కాంబోలో వచ్చే పాన్ ఇండియా సినిమాలో రుక్మిణి హీరోయిన్ గా దాదాపు కన్ఫర్మ్ అయిందనే వార్త అభిమానులను ఆనందంలో ముంచేస్తుంది. ప్రశాంత్ నీల్ కథ అందించిన శ్రీమురళి ‘బఘీరా’లో కూడా ఈమె హీరోయిన్. ఇవే కాకుండా శివ కార్తికేయన్ , శివరాజ్ కుమార్ , విజయ సేతుపతి వంటి హీరోలతో కూడా సినిమాలు చేస్తుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌ సినిమాలో హీరోయిన్గా నటిస్తే మాత్రం ఈమెకు డబల్ ప్రమోషన్ వచ్చినట్టునే చెప్పాలి. కే జి ఎఫ్ , సలార్ సినిమాల్లో నటించిన భామల కన్నా ఎన్టీఆర్ సినిమాలో అధికంగా హీరోయిన్ పాత్ర‌ ఉంటుందని కూడా అంటున్నారు.


నిజానికి రుక్మిణి వసంత్ కు రవితేజ సినిమా కూడా  అవ‌కాశం వ‌చ్చేది. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ ముందుగా మాస్ మహారాజాతో చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ కథ గురించో ఇంకేదైనా కారణమో తెలియదు కానీ ఆ సినిమా చేతులు మారి రవితేజ వద్దనుకున్నారు. లేదంటే రుక్మిణి వసంత్ ఆ ఈ మూవీలో కూడా ఉండేది. సరే ఏదైతేనేం మొత్తానికి ఇప్పుడు  ఎన్టీఆర్ సరసన నటించడం కన్నా లక్కీ ఛాన్స్ ఇంకేముంటుంది. ప్రస్తుతం వార్ 2 బ్యాలన్స్ పూర్తి చేయడం కోసం ఎదురు చూస్తున్న తారక్ - ప్రశాంత్ నీల్ సినిమాని వ‌చ్చే నేల‌నుంచి మొదలుపెట్టొచ్చట. 2025 చివ‌రిలో దేవర 2 స్టార్ట్ చేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: