ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్‌లు ఇతర ఇండస్ట్రీ నుంచి వచ్చినవారే. ఇలా ఇతర భాషల నుంచి వచ్చినప్పటికీ కూడా తమకంటూ ప్రత్యేక క్రేజీని తెచ్చుకున్నారు. అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించి వరుస సినిమా ఛాన్స్ లో కొట్టేస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు. వీరిలో సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. అలాగే అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్లు అయిన వారు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు పైన ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ మాత్రం ఒకప్పుడు యాంకర్ గా ప్రముఖ టీవీ ఛానల్ లో పనిచేసింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో హీరోయిన్గా మారింది. న‌టిగా కెరియర్ మొదలు పెట్టకముందే బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయింది. ఇప్పుడు క్రేజీ హీరోయిన్గా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.


నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది. ఇప్పటివరకు హీరోయిన్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద విజయాలు అందుకున్నాయి. టాలీవుడ్ లో దూసుకుపోతున్న హీరోయిన్ ఎవరు ఇక్కడ తెలుసుకుందాం. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియా భవాని శంకర్.. 1989లో తమిళనాడులో పుట్టిన ప్రియ భవాని మొదట్లో యాంకర్ గా పనిచేసింది.. అలాగే బుల్లితెరపై కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. అలా బుల్లితెరపై నటిస్తున్న క్రమంలో వైభవ్ రెడ్డి హీరోగా వచ్చిన మేయదా మాన్ అనే సినిమాలో హీరోయిన్గా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది .. అలాగే ఈ సినిమాలో ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా కూడా సైమా అవార్డు అందుకుంది.


సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన చినబాబు సినిమాలో సెకండ్ హీరోయిన్గా కూడా నటించింది. అలాగే ఎస్ జె సూర్యకు జంటగా మాన్ స్టర్ మూవీలో అలరించింది. ఇవే కాకుండా కొన్ని కోలీవుడ్ సినిమాలు నటించింది. ప్రస్తుతం కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న ప్రియా  తిరు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ధనుష్ హీరోగా నటించిన ఈ మూవీలో ఆమె కీలక పాత్రలో నటించింది. అలాగే యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం సినిమాలో హీరోయిన్గా తెలుగులో పరిచయమైంది. ఆ తర్వాత నాగచైతన్య ధూత వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇటీవలే గోపీచంద్ కు జంటగా భీమా సినిమాలో మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ  టాలీవుడ్ , కోలీవుడ్ లో వరుస‌ అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: