శోభిత ధూళిపాళ..  చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా నాగ చైతన్య వల్ల శోభితా ధూళిపాళ లైఫ్‌ లైన్‌లోకి వచ్చిందనే చెప్పాలి.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి దర్శనం ఇవ్వడంతో ఇదింతా కూడా నిజమే అని అంతా భావించారు. ఈ వార్తలను నిజం చేస్తూ..నాగ చైతన్య , శోభిత ధూళిపాళ సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు

 షాక్‌కు గురయ్యారు. అతి కొద్దిమంది సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని శోభిత తన కెరీర్ ప్రారంభంలో ఏదురైన చేదు అనుభవాల గురించి కష్టాల గురించి వివరించింది. తను మాట్లాడుతూ లక్ష్యం లేకుండానే సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాను.. మోడల్గా ఆడిషన్స్‌కి వెళ్లే క్రమంలో ఎన్నో సంఘటనలు.. అవమానాలు ఎదుర్కొన్న.. ఎంతో బాధపడ్డా.. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న సమయంలో మోడలింగ్ చేయాలని ప్రయత్నించా.. ఈ క్రమంలో తెల్లగా లేనని ఎన్నో విమర్శలను చూశా అంటూ ఎమోషనల్ అయింది. అలా గతంలో ఓ షాంపూ యాడికి వెళ్తే నువ్వు

 కనీసం బ్యాగ్రౌండ్ మోడల్‌గా కూడా పనికిరావు అంటూ ఇన్‌సల్ట్‌ చేశారని.. తర్వాత ఇంటికి వెళ్లి అద్దంలో చూసుకుని చాలా రోజులు బాధపడుతూనే ఉన్నా అంటూ శోభిత ధూళిపాల వెల్లడించింది. మీ వాయిస్ బాగుంటుందని అందరూ అనేవాళ్ళు.. అలా నాలో కాన్ఫిడెన్స్ కాస్త పెరిగింది. చివరకు 100 ఆడిషన్లకు హాజరయ్యాక 2016లో అనురాగ్ కస్యప్‌.. రామన్ రాఘవన్ 2లో అవకాశం దక్కిందంటూ వెల్లడించింది. ఇక ఈ సినిమా తర్వాత.. తనను రిజెక్ట్ చేసిన షాంపూ కంపెనీ ఐశ్వర్య పక్కన యాడ్లో నటించాలని.. తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉండమని ఆఫర్ చేసిందంటూ వెల్లడించింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: