మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ ప్ర‌స్తుతం గేమ్ చేంజ‌ర్ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రానుండ‌గా.. శ్రీ వెంక‌టేశ్వ‌ర బ్యాన‌ర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. చెర్రీ స‌ర‌స‌న కియారా అద్వానీ న‌టిస్తుండ‌గా.. థ‌మ‌న్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమా అనంత‌రం రామ్ చ‌ర‌ణ్ ఉప్పెన ఫేం బుచ్చిబాబు స‌నతో ఒక సినిమా చేయ‌బోతున్నాడు. ఆర్‌సీ16 వ‌ర్కింగ్‌ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రాబోతుండ‌గా.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ

 క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ చిత్రీకరణ గురించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. నవంబర్‌ 1 నుంచి రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయ‌ని తెలుస్తుంది.  ఇదిలవుండగా రామ్‌చరణ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో సినిమా దాదాపు ఖరారైంది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' లాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

 ప్రశాంత్‌నీల్‌ ఇప్పటికే ప్రభాస్‌, ఎన్టీఆర్‌ సినిమాలకు కమిటై ఉన్నారు. అవి పూర్తయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. 2029లో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇది మెగా అభిమానులకు నిజంగా శుభవార్తే. మరోవైపు రామ్‌చరణ్‌ 'గేమ్‌చేంజర్‌’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్లు రిలీజ్‌ చేస్తూ ఫ్యాన్స్‌లో జోష్‌ని నింపేస్తున్నారు సంగీత దర్శకుడు తమన్‌. 'గేమ్‌చేంజర్‌’ టీజర్‌ దసరాకు విడుదల కానుందని గతంలో వార్తలొచ్చాయి. దానిపై తాజాగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు క్లారిటీ ఇచ్చారు తమన్‌. 'దసరాకు టీజర్‌ లేదు. నిరాశ పడొద్దు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్‌. అవుట్‌పుట్‌ విషయంలో ఎక్కడా రాజీపడటంలేదు.. అంటూ చెప్పాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: