ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ హీరోయిన్ సినీ ప్రేక్షకులకు సుపరిచితం. ముంబైలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ చాలా సినిమాల్లో నటించింది. ఈ అమ్మడికి సినిమా రంగంలో మంచి గుర్తింపే ఉంది. తన నటనతో భారీగా ప్రేక్షకులను సంపాదించుకుంది. ప్రముఖ హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తోపాటు పలువురితో చాలావరకు తెలుగు సినిమాల్లో నటించింది. ప్రజెంట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఈమె ఒకరు. టాలీవుడ్‌ ఆడియెన్స్ పూజా హెగ్డేని ముద్దుగా బుట్టబొమ్మ అని పిలుచుకుంటారు. రెండేళ్ల వరకు సౌత్‌లో సందడి చేసింది పూజా హెగ్డే. ఆ తర్వాత

 కనిపించకుండా పోయింది. ఆమె నుంచి సినిమాలు రాక రెండేళ్లు పైనే అవుతుంది. తెలుగు ఆడియెన్స్ అయితే పూజాని మర్చిపోయే పరిస్థితి వచ్చింది. రెండేళ్ల క్రితం టాప్‌ స్టార్‌గా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు జీరో అయిన పరిస్థితి. అయితే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్నారు. బాలీవుడ్ షాహిద్ కపూర్‌ తో చేస్తున్న యాక్షన్ మూవీ దేవాను ఇప్పుడు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. రీసెంట్ గా విజయ్ 69 ప్రాజెక్టు గాను మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు. ఇటీవల జరిగిన పూజా

 కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. మళ్లీ వరుస హిట్స్ అందుకుని.. తన టాలెంట్ ఏంటో చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు పూజా హెగ్డే. ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటే.. మళ్లీ ఆమె వరుస ఛాన్సులు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే పూజా హెగ్డే భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి. దీంతో కొందరు మేకర్స్.. ఆమెను సెలెక్ట్ చేయడం లేదని రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు మళ్లీ ఆమె వరుస ఆఫర్లు అందుకుంటుండడంతో ఎలా సాధ్యమని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: