- డీవీవీ దాన‌య్య బ్యాన‌ర్లో ప్ర‌శాంత్ నీల్ - చ‌ర‌ణ్ మూవీ
- బుచ్చిబాబు సానా సినిమా పూర్త‌యిన వెంట‌నే సెట్స్ మీద‌కు .. !
- ఎన్టీఆర్ - నీల్ సినిమా పై భారీ అంచ‌నాలు


- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


ప్రశాంతి నీల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ యువ డైరెక్టర్ పేరు ఒక రేంజ్ లో మార్మోగిపోతుంది. ప్రశాంత్ నీల్‌ స్వస్థలం మన ఆంధ్రప్రదేశ్. ప్రశాంత్ నీల్‌ తెలుగువాడు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా నీలకంఠాపురం ప్రశాంత్ నీల్‌ స్వగ్రామం. అయితే ప్రశాంత్ చిన్నప్పుడే వాళ్ళ కుటుంబం బెంగుళూరు వెళ్లి అక్కడ స్థిరపడిపోయింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ మంత్రి నీలకంఠం రఘువీరారెడ్డి సోదరుడి కుమారుడే ప్రశాంత్. ఇక కే జి ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ప్రశాంత్ ఆ తర్వాత కేజిఎఫ్ 2 - సలార్‌ సినిమాలతో తిరుగులేని క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ఇప్పుడు అందరికళ్లు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్లో రాబోతున్న సినిమా మీద ఉంది. ఈ సినిమా కనీవిని ఎరుగని రేంజ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు.


ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా స్క్రిఫ్ట్ మీద వ‌ర్క్ చేస్తున్నాడు. ఈ సినిమా వ‌చ్చే యేడాది రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్ తో స‌లార్ 2 సినిమా చేయాల్సి ఉంది. అయితే మ‌ధ్య లో కేజీఎఫ్ 3 కూడా ఉంది. ఆ సినిమా త‌ర్వాత ఉంటుందా .. ముందు ఉంటుందా ? అన్న‌ది తెలియ‌దు కాని... రామ్‌చ‌ర‌ణ్ - ప్ర‌శాంత్ నీల్ సినిమా కూడా ఓకే అయ్యింది. ఈ సినిమా ను త్రిబుల్ ఆర్ నిర్మాత డీవీవీ దాన‌య్య భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తార‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: