సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టాక ..మనకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని.. కళ్ళు మూసుకుని కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉండాలి. అలా చేస్తేనే మన పేరు సిల్వర్ స్క్రీన్ పై మారుమ్రోగి పోవడమే కాకుండా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. అలాంటి వాళ్లకే డైరెక్టర్స్ ఎక్కువగా అవకాశాలు కూడా ఇస్తూ ఉంటారు . ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిన తంతే . అయితే ఇండస్ట్రీలో కి హీరోయిన్ అవ్వాలి అంటూ వచ్చిన అమ్మాయిలు ఆ సినిమాలు చేసేటప్పుడు కొన్నిసార్లు చాలా ఎమోషనల్ అయిపోతుంటారు .

మరి ముఖ్యంగా అమ్మాయిలు ఏదైనా హార్డ్ సీన్స్ చేసేటప్పుడు మరింతగా బాధపడిపోతూ ఉంటారు . అలాంటి సిచువేషన్ హీరోయిన్ అనుష్క కూడా ఫేస్ చేసిందట . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క ..జేజమ్మగా  జనాలు ముద్దుగా పిలుచుకుంటారు . కాగా ఈ మధ్యకాలంలో సినిమా ఆఫర్లు వస్తున్న సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న అనుష్క కెరియర్ లో చాలా చాలా రిస్కీ పాత్రలు కూడా చేసింది .

మరీ ముఖ్యంగా వేదం,  సైజ్ జీరో సినిమాలో చూసిన తర్వాత ఏ హీరోయిన్ కూడా ఇంత రిస్క్ చేయదు అంటూ అనుష్క ఫ్యాన్సే  కాదు సామాన్య జనాలు కూడా ఆమెను బాగా మెచ్చుకున్నారు. వేదం సినిమాలో ఆమె ఏకంగా ఓ వేశ్య పాత్రలో కనిపించింది . ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఆమె కెరియర్ ఢమాల్ అవుతుంది అంటూ అంత అనుకున్నారు . రోడ్డుపై ఇక అనుష్క తిరగలేదు అంటూ బాధపడ్డారు . కానీ చాలామంది అనుష్క ని ప్రశంసించారు .

అంతేకాదు ఆమె షూటింగ్ కోసం నిజంగానే బ్రోతల్ హౌస్ లో ఉండే వేశ్య్లను కలిసి వాళ్లతో మాట్లాడి వాళ్ళ బాధలను తెలుసుకొని చాలా బాధపడిపోయిందట . అంతేకాదు అక్కడే గుక్క పట్టి కూడా ఏడ్చేసిందట . ఆ టైంలో అనుష్క "ఎగిరిపోతే ఎంత బాగుంటుంది" అనే సాంగ్ కు డాన్స్ చేయాలి . చిన్న బ్రేక్ లో వేశ్యలతో మాట్లాడిన అనుష్క వాళ్ళ ప్రాబ్లమ్స్ విని చాలా ఎమోషనల్ అయిపోయిందట . అంతేకాదు వాళ్ళకి ప్రత్యేకంగా ఆమె తనకి తగిన సహాయం కూడా చేసిందట . వేశ్య లుక్ లో అనుష్క తలలో మల్లెపూలు పెట్టుకొని .. బొడ్డు కిందకు చీర కట్టి ..ఎలా హాట్ లుక్స్ లో అదరకొట్టిందో అందరికీ తెలిసిందే. అయితే వెంటనే ట్రెడిషనల్ పాత్రలోనూ మెరుస్తూ అందర్నీ ఆకట్టుకోవడం అనుష్క స్పెషాలిటీ.  అటు ట్రెడిషనల్ లోనూ ఇటు మోడ్రన్ గెటప్ లోను అచ్చుగుద్దినట్టు ఆ పాత్రకు సెట్ అయిపోతుంది అనుష్క..!

మరింత సమాచారం తెలుసుకోండి: