సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరోతో అనుకున్న కథను మరొక హీరోతో రూపొందించడం చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇలా ఒక హీరోతో అనుకున్న కథను మరో హీరోతో రూపొందించడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో అనుకున్నా ఓ కథను నాగ చైతన్య తో రూపొందించారు. మరి ఆ సినిమా ఏది ..? దాని రిసల్ట్ ఏమయింది ..? ఎందుకు దానిని వేరే హీరోతో తెరకెక్కించారు. ఇలాంటి వివరాలను తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం నాగ చైతన్య హీరో గా వాసు వర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో జోష్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాకు ముందు జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను దిల్ రాజు ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా తెలియజేశాడు. ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... నాకు వాసు వర్మ జోష్ మూవీ కథను వినిపించాడు. నాకు అది అద్భుతంగా అనిపించింది. ఆ స్టోరీ రామ్ చరణ్ తో చేయాలి అనుకున్నాను. అందులో భాగంగా చిరంజీవి గారికి ఆ కథను వినిపించాను. కానీ చిరంజీవి గారు మాత్రం ఆ కథ విని పెద్దగా ఎగ్జిట్ కాలేదు. ఆ సినిమా చరణ్ పై వర్కౌట్ కాదు అని చెప్పేశాడు. కానీ చాలా మంది మాత్రం ఆ కథ విని బ్లాక్ బాస్టర్ అయ్యే కంటెంట్ ఆ కథలో ఉంది అని అన్నారు.

ఇక ఆ తర్వాత నేను అదే కథను నాగార్జునకు వినిపించాను. ఇక నాగార్జున కు ఆ కథ బాగా నచ్చడంతో నాగ చైతన్య లాంచింగ్ సినిమా ఆఫర్ మాకు ఇచ్చాడు. ఇక సినిమా విడుదల అయ్యింది. చిరంజీవి గారు ఎక్స్పెక్ట్ చేసినట్లే ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. చిరంజీవి గారి జడ్జిమెంట్ సూపర్ అందుకే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకపోయినా స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: