తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో మారుతీ ఒకరు. ఈయన ఈ రోజుల్లో అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. చాలా తక్కువ బడ్జెట్లో చిన్న సినిమాగా రూపొందిన ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మారుతీ కి దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కూడా ఈయన చాలా తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ సినిమాలను తెరకెక్కిస్తూ రావడం , వాటితో మంచి విజయాలను అందుకోవడంతో చాలా తక్కువ కాలంలోనే మారుతీ తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయి కలిగిన దర్శకుడిగా మారిపోయాడు.

ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా బోల్తా కొట్టాయి. కొంత కాలం ఈయన దర్శకత్వంలో రూపొందిన మంచి రోజులు వచ్చాయి , పక్కా కమర్షియల్ అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇలా ఈయనకు రెండు ఫ్లాపులు వచ్చాక యావరేజ్ స్థాయి క్రేజ్ ఉన్న హీరో దొరకడం కూడా కష్టం అని చాలా మంది అనుకున్నారు.

కానీ ఏకంగా ఈ దర్శకుడు రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం మారుతి , ప్రభాస్ హీరోగా రాజా సాబ్ అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఇక ప్రభాస్ లాంటి హీరోతో సినిమా చేసే అవకాశం రావడమే మారుతి కి పెద్ద లక్కీ ఛాన్స్ అంటే ఏకంగా ఈ మూవీ కోసం ఈయనకు 15 కోట్ల పారితోషకాన్ని ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా మారుతి "రాజా సాబ్" మూవీ కోసం భారీ ఎత్తున పారితోషకాన్ని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: