రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం మిస్టర్ ఫర్ఫెక్ట్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , తాప్సి హీరోయిన్లుగా నటించగా ... దశరథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాలో మొదటగా కాజల్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ ను మూవీ యూనిట్ తీసుకుందట. ఈమె పై కొంత కాలం పాటు షూటింగ్ ను కూడా చేశారట.

కాకపోతే ఆ తర్వాత ఆ మూవీ స్టోరీ కి రకుల్ కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఈమెను తీసేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే నిజానికి ప్రభాస్ ఈ సినిమాను మొదట చేయొద్దు అనుకున్నాడట. కానీ ఆ తర్వాత చేశాడట. అలా ఎందుకు జరిగింది అనే వివరాలను దిల్ రాజు ఈ ఇంటర్వ్యూలో తెలియజేశారు. కొంత కాలం క్రితం దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... ప్రభాస్ కి మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీ కథను వినిపించినప్పుడు ఆయనకు సెకండాఫ్ పెద్దగా నచ్చలేదు. ఆ విషయాన్ని నాకు చెప్పాడు.

నేను మొత్తం కథ డెవలప్ చేసి చెబుతాను అని అన్నాను. ఆ తర్వాత ఒక రోజు కథ మొత్తం పూర్తి అయింది అని చెప్పాను. ఇక ప్రభాస్ మాత్రం ఆ సినిమాను అసలు చేయొద్దు , కథ విని నో చెబుదాం అనే ఉద్దేశంతో ఆ కథను విన్నాడట. ఇక కథ ఆ తర్వాత చాలా గొప్పగా డెవలప్ చేయడంతో ప్రభాస్ ఆ సినిమాలో నటిస్తాను అని చెప్పాడట. ఈ విషయాన్ని దిల్ రాజు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే మంచి అంచనాల నడుమ విడుదల అయిన మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీ ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: