టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి గోపీచంద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ మధ్య కాలంలో గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో విజయాలను అందుకోవడం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం గోపీచంద్ హీరోగా రూపొందిన ఓ సినిమా ఏకంగా మరో స్టార్ హీరో సినిమాకు పోటీగా వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం.

గోపీచంద్ కొన్ని సంవత్సరాల క్రితం లౌక్యం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించగా ... శ్రీ వాసు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2014 వ సంవత్సరం సెప్టెంబర్ 26 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన తర్వాత కొన్ని రోజులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన గోవిందుడు అందరివాడేలే సినిమా విడుదల అయింది. గోవిందుడు అందరివాడేలే సినిమా 2014 వ సంవత్సరం అక్టోబర్ 1 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మూవీ కావడం కృష్ణ వంశీ ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో గోవిందుడు అందరివాడేలే సినిమా విడుదలకు ముందు ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


దానితో ముందు విడుదల అయిన లౌక్యం సినిమాకు మంచి టాక్ వచ్చిన కూడా గోవిందుడు అందరివాడేలే సినిమా కనుక మంచి టాక్ ను తెచ్చుకుంటే లౌక్యం సినిమాకు పెద్ద స్థాయిలో కలెక్షన్లు రావడం కష్టం అని అభిప్రాయాన్ని చాలా మంది ఆ సమయంలో వ్యక్తం చేశారు. ఇక భారీ అంచనాల నడుమ విడుదల అయిన గోవిందుడు అందరివాడేలే సినిమాకు గొప్ప టాక్ రాలేదు. దానితో లౌక్యం సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. అలా రామ్ చరణ్ కు ఎదురెళ్లి లౌక్యం మూవీ తో గోపీచంద్ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: