గత కొంతకాలం నుంచి సినీ సెలెబ్రెటీల విడాకుల వ్యవహారాలు సోషల్ మీడియాలో ఎంత సంచలనంగా మారిపోతూ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఏకంగా అన్యోన్య దంపతులుగా, ప్రేక్షకులు అందరికీ కూడా ఫేవరెట్ కపుల్ గా గుర్తింపును సంపాదించుకున్న వారు.. ఇక ఆ తర్వాత తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ.. విడాకులు తీసుకుని వేరుపడుతున్నాము అంటూ సోషల్ మీడియాలో ప్రకటిస్తూ ఉన్నారు.


 ఈ క్రమంలోనే ఈ విడాకుల వ్యవహారం కాస్త ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతుంది. కొంతమంది సెలబ్రిటీలు విడిపోతున్న తీరు చూసి అభిమానులు సైతం షాక్ అవుతున్నారు అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి ఇలా విడాకుల వ్యవహారం వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్న పేర్లలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ పేర్లు కూడా చేరాయి. వీరిద్దరూ 2007లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది. అయితే వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ గత కొన్ని నెలలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక దీనిపై వీరిద్దరూ స్పందించకపోవడంతో ఈ వార్తలకు అసలు బ్రేక్ పడలేదు


 అయితే ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో చూసిన తర్వాత మరోసారి వీరిద్దరూ విడాకుల అంశం ఇంటర్నెట్లో ఊపు అందుకుంది  ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో.. ప్రో కబడ్డీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఐశ్వర్యరాయ్ తన కుటుంబంతో కలిసి ఆడియన్స్ గ్యాలరీలో కూర్చున్నారు  అయితే ఆమె వెంట  అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్య కూడా ఉన్నారు. ఇక ఈ సమయంలో పబ్లిక్ గానే ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ మధ్య ఏదో గొడవ జరిగింది. ఇద్దరు వాదించుకుంటూ కనిపించారు. ఇప్పుడు వీడియో పాతదే అయినప్పటికీ విడాకుల వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉండడంతో.. ఇక వీరి మధ్య విడాకుల నిజమే. అందుకే ఇలా గొడవ పడ్డారు అంటూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: