నాగచైతన్య, సమంత జంట టాలీవుడ్ లో ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ క్యూట్ కపుల్ గా గుర్తింపు పొందారు.. ఏమాయ చేసావే సినిమాతో  వీరిద్దరి మధ్య బాండింగ్ మొదలైంది... అందరూ అనుకున్నట్లు గానే వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి కూడా ఎంతో గ్రాండ్ గా  చేసుకున్నారు..కానీ పెళ్లి అయినా నాలుగేళ్ళకే వీరి వివాహ బంధం వీగిపోయింది.. వీరి విడాకులకు కారణాలు తెలియలేదు కానీ వీరు విడాకుల వార్త విని చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు.. ప్లీజ్ విడిపోవద్దు అని కామెంట్స్ కూడా చేసారు.. అలాగే నాగార్జున ఫ్యామిలీ కూడా ఎంత నచ్చజెప్పిన కానీ వారు విడిపోయారు.. విడాకుల తరువాత సమంత టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వరుస చిత్రాలలో నటిస్తు దూసుకుపోతుంది..నాగ చైతన్య కూడా వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు..అయితే వీరి విడాకులకు అసలు కారణం ఆ సినిమానే అని ఇప్పుడొక న్యూస్ తెగ వైరల్ అవుతుంది..

 చై, సామ్ వివాహం జరిగిన తర్వాత సమంత జాను సినిమాలో నటించింది..తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించిన 96 అనే సూపర్ హిట్ మూవీకి ఇది రీమేక్.టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో ముచ్చటపడి ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారు. నాగచైతన్య, సమంతతో చేయాలని ఆయన ఎంతో ప్రయత్నించారు. కథ వినిపిస్తే నాగచైతన్యకు అసలు నచ్చలేదు. ఎంత చెప్పినప్పటికీ నాగచైతన్య మాత్రం సినిమా చేయనని ఖరాఖండిగా చెప్పేశారు. సమంత మాత్రం తాను ఈ సినిమా చేస్తానని చెప్పింది. తర్వాత ఈ కథను శర్వానంద్ కు వినిపించారు. శర్వాకు నచ్చడంతో వీరిద్దరితో సినిమాను దిల్ రాజు పట్టాలెక్కించారు.సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత మొత్తం ఔట్ ఫుట్ చూసుకున్న తర్వాత దిల్ రాజుకు ఈ సినిమాపై ఓ క్లారిటీ వచ్చింది. సమంత హీరోయిన్ గా ఉన్నప్పటికీ ప్రమోషన్లు కూడా చేయకుండా రిలీజ్ చేసారు..దీనితో ఈ సినిమా విడుదలైన తర్వాత అంతగా ఆకట్టుకోలేదు..తమిళంలో సూపర్ హిట్ అయి తెలుగులో ఎందుకు ఫ్లాప్ అయిందనే దానిపై దిల్ రాజుకు కూడా అంతు పట్టలేదు.. ఆ సినిమా విషయంలో నాగ చైతన్య డెసిషన్ కరెక్ట్ అయింది.ఈ సినిమా వద్దని చెప్పినప్పటికీ సమంత చేసిందనే కారణం  వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడానికి మరింత దోహదపదిందని ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: