సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ - నయనతార, సమంత - ప్రభాస్ , బాలకృష్ణ - పూజా హెగ్డే ఇలాంటి కాంబోల కోసం ఎప్పటినుంచో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే ఇప్పటివరకు ఆ కాంబోలు  సెట్ కాకపోవడం బ్యాడ్ ధింగ్.  కాగా శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోయిన్గా మారాలి అనుకున్న జాన్వికపూర్ రీసెంట్ గానే "దేవర" సినిమాతో అభిమానులను పలకరించింది .


తెలుగులో ఆమె డేబ్యూ చేసిన మూవీ ఇదే . జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన "దేవర" సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది అని తెలిసిన మరోక్షణం అభిమానులు ఓ రేంజ్ లో సంబరపడిపోయారు . ఎందుకంటే శ్రీదేవి - స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి కాంబో ఎంత పెద్ద సూపర్ డూపర్ హిటో మన అందరికీ తెలిసిందే.  మరొకసారి అలాంటి ఒక క్రేజీ కాంబో ని సెట్ చేయబోతున్నారు జాన్వి - ఎన్టీఆర్ అంటూ బాగా ఆశపడ్డారు.



కానీ ఎందుకో అభిమానులను ఈ జంట ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.  అయితే జాన్వి కపూర్ ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా అడుగు పెట్టినప్పటి నుంచి ప్రభాస్ - జాన్వీ కపూర్ కాంబినేషన్ లో ఒక సినిమా రావాలి అంటూ బాగా ఆశపడ్డారు . బాలీవుడ్ లో ఆ కోరిక తీరలేదు . కనీసం టాలీవుడ్ లో అయినా ఆ కోరిక తీరుతుందేమో అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తూ వచ్చారు. ఫైనల్లీ ఆ మూమెంట్ వచ్చేసింది . ప్రభాస్ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. సలాడ్ 2 సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా జాన్వి కపూర్ ని సెలెక్ట్ చేసుకున్నాడట ప్రశాంత్ నీల్.  ఆల్రెడీ ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది . మరొక హీరోయిన్ క్యారెక్టర్ కోసం జాన్వి కపూర్ ని చూస్ చేసుకున్నారట . అంతేకాదు జాన్వి కపూర్ - ప్రభాస్ ల మధ్య వచ్చే సీన్స్ కూడా అదే విధంగా అభిమానులను ఆకట్టుకుంటాయి అంటూ తెలుస్తుంది. దీంతో రెబల్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: