తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నాచురల్ స్టార్ నాని పోయిన సంవత్సరం దసరా , హాయ్ నాన్న అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు మూవీలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇక నాని ఈ సంవత్సరం సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే నాని , శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ ని మొదలు పెట్టాడు.

మూవీ నుండి ఒక చిన్న వీడియోను కూడా మేకర్స్ విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే నాని , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడా ఓ మూవీ ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఇది వరకు వీరి కాంబోలో రూపొందిన దసరా మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో వీరి కాంబోలో రూపొందబోతున్న రెండవ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉంది. ఇకపోతే ఈ మూవీ బృందం మొదట ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నట్లు ఓ వార్త వైరల్ అయింది.

ఆ తర్వాత ఈ మూవీ బృందం వారు దేవి శ్రీ ప్రసాద్ ను కాకుండా అనిరుద్ రవిచంద్రన్ ను సంగీత దర్శకుడిగా ఓకే చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు అనిరుద్ రవిచంద్రన్ ఓకే చేసుకోవడానికి ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటివరకు ఈ సినిమాకు సంగీతం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్లు సమాచారం. ఒక వేళ అనిరుద్ కనుక గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఈ మూవీ యూనిట్ ఏం చేస్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: