టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన ఒకరు. ఈ బ్యూటీ నాగ శౌర్య హీరోగా రూపొందిన ఛలో అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాకి వెంకి కుడుముల దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం , ఇందులో రష్మిక తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు వరుస సినిమాలలో అవకాశాలు రావడం మొదలు అయింది.

అలాగే ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడం , ఆ తర్వాత కూడా ఈమె నటించిన సినిమాలలో తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమె చాలా తక్కువ కాలంలోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళిపోయింది. ఇకపోతే వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఛలో మూవీ తో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన రెండవ సినిమా అయినటువంటి భీష్మ లో కూడా రష్మీక హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

ఇకపోతే కొంత కాలం క్రితం నితిన్ హీరోగా రష్మీక హీరోయిన్గా ఓ మూవీ ని వెంకీ కుడుములు అనౌన్స్ చేశాడు. ఈ సినిమా స్టార్ట్ అయ్యే లోపు ఈ ముద్దు గుమ్మ కు ఇతర సినిమాల ఆఫర్లు రావడంతో ఈమె వెంకీ కుడుముల , నితిన్ కాంబో మూవీ ని పక్కన పెట్టేసి వేరే సినిమాలను ఓకే చేసింది. దానితో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో శ్రీ లీల ను రష్మిక స్థానంలో ఈ మూవీ బృందం వారు తీసుకున్నారు. ఇలా రెండు బ్లాక్ బస్టర్ విజయాలను అందించిన దర్శకుడి సినిమాను పక్కన పెట్టి రష్మిక వేరే సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: