తెలుగు సినీ పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి మణి చందన గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఈమె వరుస పెట్టి తెలుగు సినిమాలలో ముఖ్య పాత్రలలో , కీలక పాత్రలో నటిస్తూ వస్తుంది. కొన్ని రోజుల క్రితమే ఈమె రవితేజ హీరోగా రూపొందిన మిస్టర్ బచ్చన్ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. అలాగే రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన భలే ఉన్నాడే సినిమాలో కూడా ఈమె కీలకమైన పాత్రలో నటించింది.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర మూవీలో ఈమె జాన్వి కపూర్ కి తల్లి పాత్రలో నటించింది. ఇకపోతే తాజాగా మణి చందన ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మహేష్ సినిమా వల్ల తనకు ఎంతో నష్టం జరిగింది అని చెప్పింది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా మణి చందన మాట్లాడుతూ ... నేను మహేష్ బాబు హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన నిజం సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాను. నాపై చాలా రోజుల పాటు సన్నివేశాలను చిత్రీకరించారు.

అలాగే ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఇక సినిమా విడుదలకు ముందు నాపై చిత్రీకరించిన చాలా సన్నివేశాలను తీసేశారు. అలాగే పాటను కూడా తీసేశారు. ఇక నాకు ఆ సమయంలో భారీ క్రేజ్ ఉండడంతో నా అభిమానులంతా తేజ ను మణి చందన సన్నివేశాలు ఎందుకు తీసేసారు అని ప్రశ్నించారు. అలాగే నేను ఓ ఇంటర్వ్యూలో నా సన్నివేశాలను తీసేశారు అని ప్రస్తావించాను. ఇక ఆ తర్వాత సినిమాకు కూడా సాంగ్ అవసరం ఉండడంతో ఆ మూవీ లో సాంగ్ ను చేర్చారు అని మణి చందన తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: