రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన మ్యూజిక్ తో యూత్ ని ఉర్రూతలూగిస్తాడు. దేవిశ్రీ మ్యూజిక్ అంటే ప్రపంచవ్యాప్తం గా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తూ వుంటారు.. దేవి సినిమా తో మొదలైన దేవిశ్రీ మ్యూజిక్ ప్రస్థానం ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించాడు.. టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోలందరికి అలాగే తమిళ్ టాప్ హీరోలందరికి అదిరిపోయే మ్యూజిక్ అందించిన ఘనత దేవిశ్రీకే దక్కుతుంది.. ప్రసెంట్ జనరేషన్ లో యూత్ ఎక్కువగా లైక్ చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ లో దేవిశ్రీ ఒకరు..ప్రేక్షకులు తనని ముద్దుగా రాక్ స్టార్ డిఎస్పి గా పిలుస్తుంటారు.. దేవిశ్రీ ప్రసాద్ కేవలం సినిమాలలో మ్యూజిక్ అందించడమే కాకుండా లైవ్ కాన్సర్ట్ లు కూడా చేస్తూ తన మ్యూజిక్ తో యూత్ ని ఉర్రూతలూగిస్తాడు..

ఇదిలా ఉంటే గతంలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించిన దేవిశ్రీ ప్రస్తుతం కొన్ని సినిమాలకే పరిమితం అయ్యాడు.. అదిరిపోయే మాస్ సాంగ్స్ అందించే దేవిశ్రీ బీట్ తగ్గడానికి కారణం ఏమైఉంటుందని చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం టాలీవుడ్ లో తమన్ హవా నడుస్తుంది. టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలన్నీ తమన్ ఖాతాలో చేరాయి.. తాజాగా కోలీవుడ్ నుంచి వచ్చిన అనిరుధ్ దేవర సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులలో సూపర్ క్రేజ్ తెచ్చుకుని తమన్ కి గట్టి పోటీ ఇస్తున్నాడు.. ఇటు తెలుగులో తమన్, తమిళ్ లో అనిరుధ్ తో దేవిశ్రీ పోటీ పడాల్సి రావడం తో దేవిశ్రీ మ్యూజిక్ లో క్వాలిటి తగ్గుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. అయితే దేవిశ్రీ ఫ్యాన్స్ మాత్రం ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చిన దేవిశ్రీ లా మాస్ బీట్స్ అందించలేరు.. పుష్ప సినిమాలో దేవిశ్రీ సాంగ్స్ కి గ్లోబల్ వైడ్ క్రేజ్ లభించింది. పుష్ప 2 లో కూడా అదరగొట్టే మాస్ బీట్స్ సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: