టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను ఇండస్ట్రీ హిట్ విజయాలను అందుకున్నాయి. దానితో ఈయన ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆఖరుగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ కి ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా దక్కడంతో ఈయన క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. రాజమౌళి తన తదుపరి మూవీ ని మహేష్ బాబు తో చేయబోతున్నాడు. 

ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలమే అవుతుంది. ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలకు తన తండ్రి అయినటువంటి విజయంద్ర ప్రసాద్ కథను అందించాడు. విజయేంద్ర ప్రసాద్ దాదాపుగా కూడా రాజమౌళి దర్శకత్వంలో రూపొంది బ్లాక్ బస్టర్ అయిన చాలా సినిమాలకు రెండు , మూడు వారాల్లోనే కథలను అందించినట్లు తెలియజేశాడు. ఇక కొన్ని రోజుల విజయేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ... వచ్చే సంవత్సరం జనవరి నుండి రాజమౌళి , మహేష్ కాంబో మూవీ స్టార్ట్ అవుతుంది అని తెలియజేశాడు. 

అలాగే రాజమౌళి , మహేష్ కాంబో మూవీ కోసం తనకు రెండు సంవత్సరాల పాటు కథ తయారు చేయడానికి సమయం పట్టింది అని చెప్పుకొచ్చాడు. ఇక రెండు , మూడు వారాల్లో రాసిన కథలే బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటే రెండు సంవత్సరాలు టైమ్ తీసుకుని ఓ కథను రాశాడు అంటే అది ఏ స్థాయిలో ఉంటుందా అని జనాలు అంతా ఇప్పటి నుండే చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ప్రేక్షకుల్లో  నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: