* హ్యాట్రిక్ కాంబోగా సక్సెసైనా బన్నీ-త్రివిక్రమ్.!
* మరోమారు పట్టాలెక్కనున్న క్రేజీ కాంబో.!

(టాలీవుడ్-ఇండియాహెరాల్డ్):  సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు ఏర్పడుతున్నాయి అంటే ఆ సినిమాపై తెలియని ఏవో కొన్ని భారీ అంచనాలు ఏర్పడతాయి.అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్ అల్లుఅర్జున్-త్రివిక్రమ్ కాంబో. ఎనర్జీకి మారుపేరుగా ఉండే  బన్నీకి మాటల మంత్రికుడు కలిస్తే ఇక వాళ్ళు చేసే మాయ ఎలా ఉంటాదో ఇప్పటికి మూడు సినిమాల ద్వారా చూపించారు.అయితే వారి కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో అంచనాలు వేరే లెవెల్స్ లో ఉంటాయి. అల్లు అర్జున్ -త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ మ్యాజిక్ ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి,సన్నాఫ్ సత్య మూర్తి,అలా వైకుంఠపురంలో చిత్రాలన్ని ఘన విజయాలను అందుకున్నాయి. అలా వైకుంఠ పురంలో చిత్రం ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి.

జులాయ్ మూవీలో బన్నీని చాలా స్టైలిష్గా మాస్ లుక్ లో చూపించి అలరించిన త్రివిక్రం, సన్అఫ్ సత్యమూర్తి మూవీలో మరింత అల్ట్రా మోడల్గా చూపించడంలో సక్సెస్ అయ్యారు. అలాగే అలా వైకుంఠపురం మూవీలోను అల్లుఅర్జున్ ను మాస్ కమ్ స్టైలిష్ గా చూపించారు.రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడం అనేది ఏలాంటి దర్శకుడైన తెలిసిన విద్యే కానీ అలాంటి కమర్షియల్ సినిమాల్లోనే కావాల్సినంత వినోదంతో పాటు కూసింత మెసేజ్ కలిపి ప్రజలకి చెప్పడం మాటల మంత్రికుడి శైలి ఇప్పటివరకు ఆయన తన సినిమాల్లో ఇదే ఫాలో అయ్యారు.తన సినిమాల్లో కుటుంబానికి కూడా ప్రధాన్యత ఇవ్వడంలో త్రివిక్రమ్ శైలే వేరు. ముచ్చటగా మూడో సారి జత కట్టిన ఈ హిట్ కాంబో మూవీ ఐనా అలా వైకుంఠపురంలో కుటుంబ విలువలు చూపించి చూపించి ఈ తరం ప్రేక్షకులకి బంధాలంటే ఇలా ఉండాలా అనేలా రుచి చూపించడంలో కూడా సక్సెస్ అయ్యారు.త్రివిక్రమ్తో పాటు బన్నీకి కూడా ఫ్యామిలీ ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది ఆయన ఇప్పటికే పరుగు, బన్నీ,జులాయి లాంటి సినిమాలతో మహిళా ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నారు.అలాగే సన్ అఫ్ సత్యమూర్తితో ఇంకోమెట్టు కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

అయితే వీరి హ్యాట్రిక్ కాంబినేషన్ తర్వాత మరొమారు అభిమానులను అలరించేలా మరో ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే మహేష్ బాబు తో 'గుంటూరు కారం' తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమాకోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ కలయికలో సినిమాకి సంబంధించి అనౌన్స్ మెంట్ వచ్చింది. ‘జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో‘ తర్వాత వీరి కలయికలో రూపొందబోయే నాల్గవ చిత్రమిది.గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించే బన్నీ-త్రివిక్రమ్ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయట. ఈ చిత్రాన్ని సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడట త్రివిక్రమ్. ఇప్పటికే దాదాపు స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసిన త్రివిక్రమ్.. త్వరలో లొకేషన్స్ హంటింగ్, సాంగ్స్ రికార్డింగ్ వంటివి మొదలు పెట్టనున్నాడట.అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2‘ డిసెంబర్ 6న విడుదలకానుంది. ‘పుష్ప 2‘ విడుదలైన తర్వాత ఒక నెల రోజుల పాటు రెస్ట్ తీసుకుని త్రివిక్రమ్ సినిమాతో బిజీ అవుతాడట బన్నీ. 2025 ప్రథమార్థంలో అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కనున్నట్టు ఇండస్ట్రీ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: