నటి సింహం నందమూరి బాలకృష్ణ మొదటి సారిగా హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ షో ఎలాంటి సంచనాలు సృష్టించి బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఇండియాలోనే ఫేమస్ షో అయిన కపిల్ శర్మ షోను మించిపోయింది. ఇప్పటికే అన్ స్టాపబుల్ రెండు సీజన్లు పూర్తి చేసుకున్న మూడో సీజన్లో రెండు మూడు ఎపిసోడ్స్ కు మాత్రమే పరిమితం అయింది . కానీ సీజన్ 4 ను మాత్రం ఎంతో ఘనంగా రెడీ చేస్తున్నారు.


అయితే ఇప్పుడు బాలయ్య టాక్‌ షోకు ఫస్ట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి , చివరి ఎపిసోడ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో క్లోజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తుంది . మరో వైపు బాలయ్య , చిరంజీవి ఎపిసోడ్ కోసం అటు మెగా , నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి తో చేసే  ఎపిసోడ్‌ పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే మరో వైపు మరో సీనియర్ హీరో నాగార్జున కూడా ఈ షో కి ఓ ఎపిసోడ్ గెస్ట్ గా వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ ఏ టాక్ షోలో ఎక్కడ కలిసి కనిపించింది లేదు. ఇప్పుడు వీరిద్దరూ ఏం మాట్లాడుకుంటారు అనేది ఇంట్రెస్ట్ గా మారింది.


అటు వెంకటేష్ కూడా ఈ సీజన్లోనే సందడి చేయనున్నారట. మొత్తంగా తన తరం హీరోలతో ఈసారి గట్టిగానే అలరించడానికి రెడీ అయ్యారు బాలయ్య. మరోవైపు అటు రామ్ చరణ్ కూడా ఓ ఎపిసోడ్లో ప్లాన్ చేసినట్టు స‌మాచ‌రం. ఎన్టీఆర్ తో బాలయ్య ఎపిసోడ్ ఉంటుందా లేదా అనేది తెలియదు. బాలకృష్ణ షో కి మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్.. లక్కీ భాస్కర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ  ఎపిసోడ్ కి రానున్నరట. ఇలా మొత్తంగా బాలయ్య‌ సీజన్ 4ను మాత్రం ప్రేక్షకులకు ఫుల్ కీక్‌ ఇవ్వడానికి రెడీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: