తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో రామ్ పోతినేని ఒకరు. ఈయన దేవదాసు అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత కూడా రామ్ సెలెక్టివ్ గా కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటూ వెళ్ళాడు. దానితో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈయన కెరియర్ ప్రారంభం నుండి చాలా కాలం వరకు ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాల జోలికి వెళ్లకుండా లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలను చేస్తూ వచ్చాడు.

అలాంటి మూవీ లతోనే ఎక్కువ శాతం విజయాలను కూడా అందుకున్నాడు. కొంత కాలం క్రితం రామ్ , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈయన వరుస పెట్టి అలాంటి సినిమాలలోనే నటించాడు. అందులో భాగంగా ఈయన ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత నటించిన ది వారియర్ , స్కంద , డబల్ ఇస్మార్ట్ మూవీలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దానితో చాలా మంది జనాలు కూడా రామ్ తనకు ఎంతో అచ్చొచ్చిన రొమాంటిక్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తే మంచిది అనే ఆలోచనను కూడా వ్యక్తం చేశాడు.

ఇక రామ్ కూడా అదే రూట్ లోకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది. రామ్ తన తదుపరి మూవీ ని మహేష్ బాబు దర్శకత్వంలో చేయబోతున్నాడు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా కాకుండా క్లాస్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి రామ్ ఇలాంటి జోనర్ మూవీలతో ఎలాంటి సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: