మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ త‌న‌ అందచందాలతో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకప్పుడు యువత కలల యువరాణిగా వెలిగిన ఐశ్వర్యను చూసేందుకే సినిమాలు కి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఈ ప్రపంచ సుందరి ముందుగా కోలీవుడ్లో కెరియర్ను ప్రారంభించింది. మణిరత్నం దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఇద్దరు సినిమాలో నటించింది తొలి సినిమాతోనే స్టార్ హీరోలతో కలిసి నటించే ఛాన్స్ ను కొట్టేసింది. ఈ సినిమా తర్వాత సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో జీన్స్ మూవీలో హీరోయిన్గా నటించి బ్లాక్ బస్టర్ హీట్ అందుకుంది.


ఇక తర్వాత వరస సినిమాలతో భారీ విజ‌య‌లు అందుకుంటూ దూసుకుపోయింది. అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు రావటంతో అక్కడికి వెళ్లిపోయి తక్కువ సమయంలోనే ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా మారింది. అలాంటి ఐశ్వర్యరాయ్ తన కెరియర్లో ఒక్క తెలుగు సినిమాలో మాత్రమే నటించిందట. అది కూడా మొత్తం సినిమా కాదు కేవలం ఒక్క పాటలో మాత్రమే ఆమె కనిపించింది. నాగార్జున హీరోగా 1999లో వచ్చిన రావోయి చందమామ మూవీలో ఒక పాటలో ఐశ్వర్యరాయ్ నటించింది.


ఇక ఈ సినిమాను జయంత్‌ సి పరాన్జీ  తెరకెక్కించాడు. దర్శకుడికి ఐశ్వర్యరాయ్ ఫ్యామిలీకి మంచి స్నేహ సంబంధం ఉండడంతో రావోయి చందమామ సినిమా సమయంలో శిల్పా శెట్టిని కలవడానికి ముంబై వెళ్లాడు. ఇక అదే సమయంలో ఐశ్వర్యరాయ్ ని కూడా కలిశాడు. అప్పుడు ఐశ్వర్యరాయ్ మీ సినిమాల్లో  ఇతర హీరోయిన్లను నటించమని అడుగుతున్నారు నన్ను మాత్రం ఎందుకు ? అడుగ‌రని ప్రశ్నించింద‌ట‌. దాంతో జయంత్ శిల్పాశెట్టితో కాకుండా ఐశ్వర్యరాయ్ తో ఆ సాంగ్ చేయించారు. ఐశ్వర్య కూడా ఆ ఒక్క సినిమాలో కనిపించి తెలుగు ఆడియెన్స్‌ను అలరించింది. ఇక ఇప్పుడు రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ దర్శకుడు మణిరత్నం తెర్కెక్కించిన  " పొన్నియిన్ సెల్వన్ " సినిమాలతో ప్రేక్షకులను మరోసారి తన నటనతో కట్టిపడేసింది ఐశ్వర్యారాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: