తెలుగు సినీ పరిశ్రమంలో అద్భుతమైన క్రేజ్ కలిగిన మాస్ దర్శకులలో గోపీచంద్ మలినేని ఒకరు. ఈయన రవితేజ హీరోగా రూపొందిన డాన్ శీను అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి తోనే మంచి విజయాన్ని అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ఈయన ఆ తర్వాత చాలా వరకు మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లకు దర్శకత్వం వహించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన మాస్ దర్శకుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. 

గోపీచంద్ ఆఖరుగా బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరో గా రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ కి మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమాను SDGM అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. 

ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాలో ఏకంగా 10 యాక్షన్ ఎపిసోడ్లు ఉండబోతున్నట్లు , అవి కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పది యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు ఓ వార్త బయటికి రావడంతో ఏకంగా గోపీచంద్ , బోయపాటి నే రియాక్షన్స్ సన్నివేశాలను తెరకెక్కించడంలో మించిపోయినట్లున్నాడే అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఈ మూవీ కనుక మంచి విజయం సాధిస్తే గోపీచంద్ మలినేని కి హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు లభించే అవకాశం చాలా వరకు ఉంటుంది. మరి ఈ సినిమాతో గోపీచంద్ కి ఏ స్థాయిలో క్రేజ్ హిందీ సినీ పరిశ్రమలో వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: