చిత్ర పరిశ్రమకు చాలా మంది నటులు హీరోలుగా అడుగుపెట్టారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ అందుకుని స్టార్ హీరోలుగా  ఎదిగారు. కొంతమంది మాత్రం కెరియర్లో ఇబ్బందులు ఎదుర్కోవటం కారణంగా అవకాశాలు కూడా కోల్పోతూ ఉంటారు. అలాగే చిత్ర  పరిశ్రమకు గతంలో సీనియర్ నటులుగా ఉన్న వారు తమ వారసులుగా కొడుకులను ఇండస్ట్రీలకు తీసుకువచ్చారు. అలా వచ్చిన వారిలో కొంతమంది సక్సెస్ అవ్వగా.. మరికొందరు లో అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పుడు చెప్పుకోబోయే ఒక నటుడుకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయింది. ఇంటికి అ న‌టుడు ఎవరు అనే విషయాలు ఇక్కడ చూద్దాం.


టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .. తెలుగు చిత్ర పరిశ్రమలో స్వర్ణ యుగాన్ని చూసిన న‌టులు చిత్ర పరిశ్రమను విడిచి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నారు .. అలాగే ఆ తరానికి ప్రతినిధిగా మిగిలిన కొందరు నటుల్లో గిరిబాబు కూడా ఒకరు. ఈయన అప్పట్లో హీరోగా , విలన్ గా , హాస్య నటుడుగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , నిర్మాతగా దర్శకుడుగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించి అందర్నీ మెప్పించారు. దేవతలారా దీవించండి సినిమాతో దర్శకుడుగా కూడా మారారు. ఆయన వారసులుగా రఘు బాబు, బోసు బాబులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక గిరిబాబు తన చిన్న కొడుకు బోసు బాబును హీరో చేయాలని ఎన్నో కలలు కన్నారు. అప్పటికే దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న గిరిబాబు తన కొడుకుని హీరోగా పరిచ‌యం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని సొంత దర్శకత్వంలో ఇంద్రజిత్ మూవీని తెరకెక్కించారు.


సరిగ్గా అదే సమయంలో చిరంజీవి కొదమ సింహం మూవీ కూడా తెరకెక్కి ఆశ్చర్యంగా ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. యాక్షన్ సినిమాలు తీయటంలో గిరిబాబు కు మంచి గుర్తింపు ఉండడంతో ఇంద్రజిత్తు పై అంచనాలు భారీగా ఉన్నాయి .. విడుదల తేది అనౌన్స్ చేసిన సమయంలోనే కోద‌మ సింహం సినిమాకు సంబంధించిన కొందరు రఘు బాబుకి మాయ మాటలు చెప్పి సినిమాను చూపించారు. ఇంద్రజిత్‌ రిలీజ్ అయ్యే తేదీనే కొదమ సింహం కూడా రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని పేపర్లో చూసి షాక్ అయిపోయారు అందరూ.
ఇంద్రజిత్ కి బయర్లు కూడా రాకపోవడంతో కొదమ సింహం రిలీజ్ విషయాలు తెలుసుకొని అంత పెద్ద స్టార్ నటిస్తున్న సినిమాను తట్టుకుని నిలబడగలరా అని ఆయనను అడిగారు . ఎంతో కష్టపడి ఇంద్రజిత్తు తాను చెప్పిన రేటు కంటే తక్కువకి అడిగారని చెప్పారు. అయితే కొదమ సింహం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించని ఫలితం రాబట్టలేదని దీంతో ఇంద్రజిత్తుకు బిజినెస్ సరిగ్గా జరగలేదని గిరిబాబు అన్నారు. మెగాస్టార్ సినిమా ఏ నష్టపోతే మీ సినిమాని ఎవరు కొంటారని అడగడంతో బడ్జెట్ కంటే తక్కువ ధరకే మూవీని అమ్మేసారట. మంచి రెస్పాన్స్ వచ్చినా కూడా ఫ్లాప్ అని ప్రచారం చేశారని ఆయన చెప్పారు. మంచి రెస్పాన్స్ వచ్చినా కూడా ప్లాప్ అని అందరూ చెప్పినట్లు ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: