రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇకపోతే ప్రభాస్ చాలా సంవత్సరాల క్రితం ప్రభుదేవా దర్శకత్వంలో పౌర్ణమి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో త్రిష , చార్మి , సింధు తులాని హీరోయిన్లుగా నటించారు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎమ్ ఎస్ రాజు నిర్మించిన ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

ఇకపోతే ఈ మూవీ మ్యూజిక్ కి ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే ఈ సినిమాలో వివాహిత పాత్రలో ఒక అమ్మాయి నటించింది. ఇక ఆమె పౌర్ణమి సినిమాలో ఎప్పుడూ ప్రభాస్ వెనుక ఈ సినిమాలో పడుతూ ఉంటుంది. పౌర్ణమి సినిమాలో ఆ పాత్ర చేసింది మరెవరో కాదు మధు శర్మ. ఈమె ఈ సినిమాలో మోహిని అనే పాత్రలో నటించింది. 

ముంబై కి చెందిన ఈ బ్యూటీ పౌర్ణమి సినిమా తర్వాత పలు సినిమాలలో నటించింది. పౌర్ణమి సినిమాలో ఈమె 60 ఏళ్ల ఏవీఎస్ కు భార్యగా కనిపించింది. పౌర్ణమి సినిమా తర్వాత ఈ ముద్దు గుమ్మ తెలుగు లో హనుమంతు , బ్రహ్మ అనే సినిమాలలో నటించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో మధు శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను , వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: