ఇండియన్ సినీ పరిశ్రమలో అత్యంత వేగంగా ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగ , ప్రశాంత్ నీల్ ఉంటారు. సందీప్ రెడ్డి వంగ "అర్జున్ రెడ్డి" అనే మూవీ తో దర్శకుడిగా కెరీర్ను ప్రారంభించాడు. ఈ మూవీ ని తెలుగు లో మాత్రమే విడుదల చేశాడు. ఈ మూవీ తో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈయన ఇదే సినిమాను హిందీ లో కబీర్ సింగ్ పేరుతో రీమిక్ చేశాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈయనకు హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది.

ఆ తర్వాత ఈ దర్శకుడు యానిమల్ అనే సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందించి విడుదల చేశాడు. ఈ మూవీ తో ఒక్క సారిగా ఈయనకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక ప్రస్తుతం ఈ దర్శకుడి లిస్టులో చాలా మంది హీరోల సినిమాలు ఉన్నాయి. రన్బీర్ కపూర్ హీరోగా యానిమల్ పార్క్ , ప్రభాస్ హీరోగా స్పిరిట్ , అల్లు అర్జున్ హీరోగా ఓ మూవీ కి ఈయన కమిట్ అయ్యి ఉన్నాడు. ఇకపోతే ప్రశాంత్ నీల్ "ఉగ్రం" అనే మూవీ తో కెరియర్ను ప్రారంభించి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఆ తర్వాత కే జి ఎఫ్ సిరీస్ మూవీలను పాన్ ఇండియా మూవీలుగా రూపొందించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక కొంత కాలం క్రితం సలార్ మూవీ తో మరో విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈయన సలార్ 2 సినిమాను రూపొందిస్తున్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ మూవీ ని రూపొందించడానికి రెడీగా ఉన్నాడు. ఈయన లిస్టులో కూడా చాలా మంది హీరోలు ఉన్నారు. ఇలా వీరిద్దరు కూడా ఒక సినిమా స్టార్ట్ కాకముందే మరి కొంత మంది హీరోలను రెడీగా పెట్టుకొని ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: