టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో చాలా సినిమాల్లో నటించిన ఎక్కువ శాతం హీరోయిన్లను రిపీట్ చేయలేదు. తన కెరియర్లో కేవలం ఒకే ఒక్క హీరోయిన్ తో మాత్రమే పవన్ కళ్యాణ్ మూడు సినిమాలలో నటించారు. ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? ఆ ముద్దుగుమ్మ శృతి హాసన్. పవన్ కళ్యాణ్ , శృతిహాసన్ కాంబోలో మొదటగా గబ్బర్ సింగ్ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా హిందీ మూవీ అయినటువంటి దబాంగ్ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఆ మూవీ కంటే ముందు శృతి హాసన్ నటించిన ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు.

ఇక గబ్బర్ సింగ్ మూవీ కంటే ముందు పవన్ కళ్యాణ్ కు కూడా అనేక ఫ్లాప్ లు ఉన్నాయి. అలా వీరిద్దరి కాంబోలో మొదటగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దానితో ఈ కాంబో కు కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా కాటమ రాయుడు అనే మూవీ రూపొందింది. ఈ సినిమా తమిళ మూవీ అయినటువంటి వీరమ్ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. మంచి అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

కానీ ఈ మూవీ లో పవన్ , శృతి జంటకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా వకీల్ సాబ్ అనే మూవీ తెరకెక్కింది. ఈ సినిమా హిందీ మూవీ అయినటువంటి పింక్ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ తో వీరి కాంబోకు మరో విజయం దక్కింది. ఇలా కెరియర్ లో ఎప్పుడూ కూడా ఏ ముద్దు గుమ్మ తో మూడు సార్లు నటించని పవన్ కళ్యాణ్ కేవలం శృతి హాసన్ తో మాత్రమే మూడు సార్లు నటించాడు. ఇక వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాల్లో రెండు సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: