టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో బాలయ్య సరసన ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా కనిపించబోతుండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీమూవీ ని నిర్మిస్తున్నాడు.

ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఎన్బికే 109 మూవీ గురించి అనేక ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. తాజాగా నాగ వంశీ మాట్లాడుతూ ... బాలయ్య , బాబి కాంబోలో రూపొందుతున్న సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా హైలైట్ గా ఉంటుంది.

ఇప్పటికే కొంత భాగం షూటింగ్ అయ్యింది. అందులోని కొన్ని సన్నివేశాలు హైలైట్ గా వచ్చాయి. మరికొన్ని సన్నివేశాలు కూడా హైలెట్గా రూపొందించడానికి అన్ని రెడీ చేసుకున్నాం. ఇప్పటివరకు బాబీ దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాల కంటే ఈ సినిమా అద్భుతమైన స్థాయిలో ఉంటుంది అని ఆయన చెప్పాడు. ఇలా ఎన్బికె 109 మూవీ గురించి నాకు వంశీ ఈ స్థాయిలో చెప్పడంతో ఈ మూవీ పై అంచనాలు ప్రేక్షకుల్లో మరింతగా పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: