సినీప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాలు రావాలంటే దర్శకనిర్మాతల పక్కలో పడుకోవాల్సిందే అని చాలామంది నటీమణులు షాపింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అగ్ర క‌థానాయిక‌లు కూడా ఇలాంటి కామాంధులు ఇండస్ట్రీలో ఉన్నారని బ‌హిరంగంగా కామెంట్లు చేశారు. అవకాశాల కోసం కొంతమంది కాంప్రమైజ్ అయితే మరి కొంతమంది మాత్రం అవకాశాలు రాకపోయినా పర్లేదు అని అలాగే ఉండిపోతారు. ఇక కెరీర్ ఆరంభ‌మే బోల్డ్ పాత్ర‌లు చేస్తూ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న మ‌ల్లికా శెరావ‌త్ కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొందట. అడ్వాన్సులు ఇచ్చిన‌ ప‌లువురు ఫిలింమేక‌ర్స్ ఆమెను రాత్రికి వస్తావా అని అడిగారట. కానీ అందుకు మల్లికా ఒప్పుకోలేదు అందుకే ఆమెకు వచ్చిన అవకాశాలని కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోయాయట.

ఈ విషయాన్ని తాజాగా మ‌ల్లికనే తెలిపింది. "విక్కీ విద్యా కా వో వాలా" వీడియోలో అతిధి పాత్ర చేసి బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది మల్లిక. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ ది రణ్‌వీర్ షో పోడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో పాల్గొని క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్లు చేసింది. పాత్రలను కోల్పోకుండా ఉండటానికి ఈ రంగంలో వ్యక్తిత్వాన్ని చంపుకోవాలని మ‌ల్లిక వ్యాఖ్యానించింది. పరిశ్రమలో కంటిన్యూ అవ్వాలంటే అందరినీ పొగుడుతూ ఉండాలని, బుజ్జగించడం కూడా నేర్చుకోవాలని ఆమె పేర్కొంది.

"నేను హర్యానాకు చెందిన సాంప్రదాయ కుటుంబాల్లో పుట్టిన అమ్మాయిని. దర్శక నిర్మాతలు అడిగే కోరికలను తీర్చడానికి నేను సిద్ధంగా లేను. కొంతమంది ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు నిర్మొహ‌మాటంగా నో చెప్పా" అని మల్లిక వెల్లడించింది. బాలీవుడ్‌లో బోల్డ్ ఆన్-స్క్రీన్ ఇమేజ్ కారణంగా తనని అందరూ అదోలా చూసే వారిని పేర్కొన్నది. ఆఫ్-స్క్రీన్‌లో కూడా అలాంటివి చేయడానికి ఆమె సిద్ధంగా ఉంటుందని కొందరు భావించారట. వాళ్లలో కొందరు రాత్రిపూట ఆమెకు ఫోన్ చేసి "ఈ రాత్రికి వస్తావా? అని కూడా అడిగేవారట‌. అయితే మల్లిక మాత్రం అలాంటి క్యారెక్టర్ తనది కాదంటూ ఫస్ట్ టైం చేసేదట. మల్లిక చివరిసారిగా RK/RKay (2022)లో కనిపించింది. ఇమ్రాన్ హష్మీకి జోడీగా మర్డర్‌ సినిమా చేసి చాలా గుర్తింపు దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: