టాలీవుడ్ హీరోయిన్ మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన అందం కట్టుబొట్టుతోనే అచ్చ తెలుగు అమ్మాయిగా పేరు సంపాదించిన లావణ్య త్రిపాఠి.. మెగా హీరో నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ ని ప్రేమించి మరి వివాహం చేసుకున్నది. సినిమాలలో నటిస్తున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి ఆ తర్వాత పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.. వివాహమనంతరం కూడా తమ సినిమాలలో వీరు బిజీగా అయిపోయారు.



సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందని న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది.. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ నిన్నటి రోజున దసరా పండుగ సందర్భంగా లావణ్య త్రిపాఠి తన అత్తమామలతో పాటుగా తన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీంతో మెగా అభిమానులు లావణ్య కు వరుణ్ తేజ్ కి సైతం ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.


అయితే ఇలాంటి విషయాలను అఫీషియల్ గా వస్తేనే మంచిది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. లావణ్య త్రిపాఠి వివాహమైన తర్వాత సినిమాలలో అవకాశాలు తగ్గించుకుంటూ కేవలం తన భర్తతోనే ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి మక్కువ చూపుతోంది. మొత్తానికి మెగా కుటుంబ సభ్యులతో కలిసిపోయిన లావణ్య అప్పుడప్పుడు తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. మరి ఈ విషయం పైన లావణ్య ఎలా స్పందిస్తుంది అనే విషయం తెలియాల్సి ఉన్నది. ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ నటించిన సినిమాలన్నీ కూడా ఈమధ్య భారీ ఫ్లాపులుగా మిగిలిపోతున్నాయి.. ప్రస్తుతం మట్కా అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు ఈ సినిమా సక్సెస్ అయితేనే వరుణ్ తేజ్ రేంజ్ తగ్గకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: