మన తెలుగు ఇండస్ట్రీలో నటుడు రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోని మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ లలో ఒకరు రాజేంద్రప్రసాద్ అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.. రాజేంద్రప్రసాద్ తెలుగు సినీ పరిశ్రమలో ఉండడం అదృష్టం. ఆయన రాజేంద్రప్రసాద్ ఏ పాత్ర అయినా చేయగల సత్తా తనలో ఉంది. అలాగే ఏ పాత్రలో నైనా కానీ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటాడు.. ముందుగా రాజేంద్రప్రసాద్ హీరోగా తన కెరియర్ ను మొదలు పెట్టగా అనంతరం కామెడీ హీరోగా., ఆ తర్వాతి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్టార్ హీరోల కోసం స్నేహితుడుగా ఇలా పలు పాత్రలలో పోషించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో అయితే హీరోయిన్స్ కు, యంగ్ హీరోలకు తండ్రి క్యారెక్టర్ లో చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అయితే అప్పటిలో హీరోగా అతని సినిమా ప్రస్థానం, అతని హీరోయిన్ , కామెడీ టైమింగ్ అందరిని ఎంతగానో బాగా ఆకట్టుకునేది. అయితే ఈ తరుణంలో అతనితో కలిసి పనిచేసిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఇక హీరోయిన్లలో ఒకరుతో రాజేంద్రప్రసాద్ ప్రేమలో ఉన్నారని తాజాగా ఒక రూమర్ వైరల్ అవుతూ ఉంది. ఈ విషయం ఎప్పటికీ వైరల్ గానే అవుతూ ఉండడం మనం చూడవచ్చు. ఈ తరుణంలో రాజేంద్రప్రసాద్ తో పాటు ఆ హీరోయిన్ కూడా ఈ విషయంపై  క్లారిటీ ఇచ్చింది.

ఇకపోతే ఆ హీరోయిన్ ఎవరో కాదు రజిని.. తెలుగు సినిమాలలో రాజేంద్రప్రసాద్ సరసన ఎక్కువ సినిమాలలో నటించిన హీరోయిన్ కూడా రజిని. అప్పటిలో రాజేంద్ర ప్రసాద్ రాజు నీ ప్రేమలో పడ్డారని అనేక రూమర్లే వచ్చాయి.. ఈ తరుణంలో రాజేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయంపై మాట్లాడుతూ.. ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ తో ఇలా రూమర్లు రావడం సహజమే అంటూ అందులో వింత ఏముంది  అని అన్నారు.. ఈ తరుణంలో ఏ మూలాన ఏ కోషానైనా కాస్త అయినా నిజం లేదా అని యాంకర్ అడగగా అందుకు రాజేంద్ర ప్రసాద్ సమాధానం ఇస్తూ అందరూ అనగనగా అభిమానం పెరిగింది. కానీ., వాళ్లు ప్రచారం చేసినంత మాత్రాన ఏది ఉండదు అన్నట్టు రాజేంద్రప్రసాద్ సమాధానం ఇచ్చారట.

ఇక రజిని విషయానికి వస్తే.. ఆమె పెళ్లి చేసుకున్న అనంతరం తెలుగు ఇండస్ట్రీకి దూరమైపోయారు. ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ముగ్గురు పిల్లల అనంతరం తన భర్తకు విడాకులు ఇచ్చినట్లు సమాచారం. అలాగే రాజేంద్రప్రసాద్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నారు. ఇక ఇటీవలే తన కూతురు గుండెపోటు రావడంతో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో డిప్రెషన్ లో ఉన్న రాజేంద్రప్రసాద్ ను  ఓదార్చడం ఎవరి వల్ల కూడా కావడం లేదు. ఫిలిం ఇండస్ట్రీ సినీతాలను అందరూ కూడా అతని ఇంటికి వెళ్లి పరామర్శిస్తూ రాజేంద్రప్రసాద్ కు ధైర్యం చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: