ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది సెలబ్రిటీలు తమ వారుసులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే వారిలో కొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా, హీరోయిన్గా మంచి ఇమేజ్‌ను తెచ్చుకున్నారు .. అయితే మరి కొంత మంది తెర ముందుకు రాకపోయినా భారీ క్రేజ్ ను సంపాదించుకున్నారు. ముఖ్యంగా మన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది స్టార్ కిడ్స్ ఉన్నప్పటికీ బాలయ్య కూతుర్లు మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి. వీరు ఎప్పుడు కూడా మీడియా ముందు పెద్దగా కనిపించరు కానీ వీరికి మాత్రం టాలీవుడ్ లో ప్రత్యేకమైన అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి.


ప్రత్యేకించి బాలయ్య కూతుర్లకి ఎందుకింత ప్రత్యేకత అనే విషయం ఇప్పుడు ఎక్కడ తెలుసుకుందాం .. అసలు విషయంలోకి వెళితే.. తాజాగా బాలకృష్ణ అన్ స్టాపబుల్  సీజన్ 4 లాంచింగ్ ప్రెస్ మీట్ నిర్వహించగా.. ఈ కార్యక్రమంలో బాలయ్య చిన్న కూతురు తేజస్విని కూడా పాల్గొని తొలిసారి మీడియ ముందుకు వచ్చిన చాలా చక్కగా మాట్లాడుతూ అందరిలో మంచి అటెన్షన్ క్రియేట్ చేసింది. ఇక తేజస్విని మాట్లాడుతూ... ఈరోజు నాకు ఎంతో స్పెషల్.. ఎందుకంటే తొలిసారి మీ ముందు నేను ఎలా నుంచున్నాను.. అరవింద్ అంకుల్ కి ఈ ఆలోచన వచ్చినప్పుడు అందరూ ఆలోచించారు అసలు ఈ షో చేద్దామా వద్దా అని.. అయితే నాన్న మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా చేయాల్సిందే అని చెప్పారు. నాన్న ధైర్యం చేసి చెప్పడం వల్ల ఈరోజు అన్ స్టాపబుల్ ఈ స్టేజ్ కి వచ్చింది.  ఐఎండిబి రేటింగ్స్ లో అన్ స్టాపబుల్ షో ప్రపంచంలో 18వ ర్యాంకు సాధించగా.. ఇండియాలో మోస్ట్ పాపులర్ షోగా నిలిచింది .


ఇందులో యూనిక్ పాయింట్ ఏంటంటే నాన్నలో ఎవరు చూడని యాంగిల్ ను అందరూ చూశారు. ముఖ్యంగా అన్ స్టాపబుల్ అంటే చాలెంజ్ వచ్చినప్పుడు ధైర్యంగా తీసుకోవాలి. పక్కన ఎవరుంటే వాళ్ల కోసం నిలబడాలి. ఇక సమాజం కోసం ముందడుగు వేయాలి. ఇవన్నీ నాన్న లో ఉన్నాయి.  ముఖ్యంగా ఆయన ఫ్యామిలీ, ఫ్రెండ్స్,  ప్రజల కోసం నిలబడే వ్యక్తి. క్యాన్సర్ హాస్పిటల్ లో ఉండే పేషెంట్స్ కి అది దేవాలయం. త్వరలో  కచ్చితంగా నాన్నలోని ఇంకో యాంగిల్ ని చూస్తారు అంటూ తేజస్విని మాట్లాడింది. ఇలా మీడియా ముందుకు వచ్చిన మొదటిసారే అద్భుతమైన మాట తీరుతో అందర్నీ మెప్పించింది తేజస్విని .. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది సెలబ్రిటీలు ఉన్నా .. వీరు మాత్రం తెర ముందుకు రాకపోయినా అందరికంటే ఎంతో స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: