తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బాబి ఒకరు. ఈయన రవితేజ హీరోగా రూపొందిన పవర్ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. దానితో ఈయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఏకంగా ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈయన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జై లవకుశ మూవీ ని రూపొందించి బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్నాడు.

ఆ తర్వాత వెంకటేష్ , నాగ చైతన్య హీరోలుగా వెంకీ మామ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ దర్శకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వాల్తేరు వీరయ్య అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ లో రవితేజ ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం బాబి , బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు.

ఇకపోతే తాజాగా ఈ మూవీ నిర్మాత అయినటువంటి నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... బాబి , బాలకృష్ణ తో అద్భుతమైన సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. ఇప్పటివరకు బాలయ్య ను మీరు ఎప్పుడూ చూడని కొత్త కోణంలో బాబి చూపించబోతున్నాడు. ఇక బాబి ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో కంటే బాలయ్య తో చేస్తున్న సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఇలా బాబి ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల కంటే బాలయ్య తో చేస్తున్న సినిమా అదిరిపోయి రేంజ్ లో ఉంటుంది అని నాగ వంశీ తాజా ఇంటర్వ్యూ లో చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: