తెలుగు బుల్లితెరపై ఎంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటిమనులలో నటి శ్రీవాణి కూడా ఒకరు. మొదట ఈమె చంద్రముఖి అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఆ తర్వాత విక్రమాదిత్య అనే వ్యక్తిని ఈమె ప్రేమించి వివాహం చేసుకుంది నటి శ్రీవాణి..యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. విక్రమాదిత్య, శ్రీవాణికి నందిని అనే ఒక పాప కూడా జన్మించింది. ఇదంతా ఇలా ఉంటే తాజాగా నటి శ్రీవారికి రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.వాటి గురించి పూర్తిగా చూద్దాం.


నటి శ్రీవాణి భర్త విక్రమాదిత్య వీడియోలో ఇలా తెలియజేస్తూ.. మూడు రోజుల క్రితం శ్రీవాణి తన కుటుంబ సభ్యులతో కలిసి చీరాల బీచ్ కి వెళ్తూ ఉండగా వాళ్ళ అమ్మ వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ అయ్యిందని.. దీంతో శ్రీవాణికి నుదుటిన దెబ్బ తగిలినాడంతో పాటు రైట్ హ్యాండ్ కి ఫ్యాక్చర్ అయినట్లుగా తెలియజేశారు. అయితే శ్రీవాణి ప్రస్తుతం గుంటూరు హాస్పిటల్ లో ఉన్నదని అలాగే ఆమె నుదుట మీద చాలా దెబ్బ తగలడంతో కుట్లు కూడా పడ్డాయని తెలియజేశారు.



అలాగే ప్లాస్టిక్ సర్జరీ చేయాలని హాస్పిటల్ వాళ్ళని కోరడం జరిగింది. ముఖ్యంగా షూటింగ్లలో ఈ మార్కు కనిపించకుండా ఉండడానికి సర్జరీ కోరామని తెలిపారు. చాలా డీప్ గా చర్మం తెగిపోవడంతో స్ట్రక్చర్స్  మాత్రమే వేయాలని ప్లాస్టిక్ సర్జరీ సరిపోదని డాక్టర్లు తెలియజేశారట.అయితే ఈ విషయం తెలిసిన అభిమానుల సైతం శ్రీవాణితో పాటుగా ఆమె కుటుంబ సభ్యులు వెంటనే కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. విక్రమాదిత్య, శ్రీవాణి ఇద్దరు కలిసి కూడా ఒక సీరియల్ నటించడానికి సిద్ధమైన సమయంలో ఇలాంటి ప్రమాదం జరిగిందని శ్రీవాణి భర్త విక్రమాదిత్య ఎంతో ఎమోషనల్ గా తెలియజేస్తున్నారు. తామిద్దరం కలిసి కొత్త నిర్ణయాలతో కొత్త అడుగులు వేయబోతున్న సమయంలో ఇలా ప్రమాదం జరిగినప్పటికీ ఆ దేవుడి దయ వల్ల బయటపడ్డామంటూ తెలిపారు అందుకు సంబంధించి వీడియో కూడా రిలీజ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: