నందమూరి నట సింహం బాలకృష్ణ ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో గత కొంతకాలంగా ఆన్ స్టాపబుల్ అనే టాక్ షో హోస్ట్ కి వ్యవహరిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఆహా ఓ టీ టీ లో ఆన్ స్టాపబుల్ టాక్ షో కి సంబంధించిన మూడు సీజన్లు విజయవంతంగా కంప్లీట్ అయ్యాయి. ఇక మరికొన్ని రోజుల్లోనే నాలుగవ సీజన్ కూడా స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే నాలుగువ సీజన్ కి సంబంధించిన కొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణ కూడా పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఇకపోతే ఆన్ స్టాపబుల్ సీజన్ ఎప్పుడు ప్రారంభం అయిన ఒక న్యూస్ మాత్రం కామన్గా వైరల్ అవుతూ ఉంటుంది.

అదేమిటి అంటే బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నాడు అని. ఇక ఇప్పటివరకు అనేక సార్లు అన్ స్టాపబుల్ షోవ్కు చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నాడు అని చిరంజీవి , బాలకృష్ణ ఒకే వేదికపై సందడి చేయబోతున్నారు అని అనేక వార్తలు వచ్చాయి. మరి ముఖ్యంగా అన్ స్టాపబుల్ సీజన్ ప్రారంభం అవుతుంది అంటే చాలు సీజన్ ప్రారంభ ఎపిసోడ్ కు చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నాడు అని ఒక వార్త వైరల్ అవుతూ వస్తుంది. మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోయే సీజన్ కూడా చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నాడు , అది కూడా మొదటి ఎపిసోడ్ కే చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నాడు అని ఓ వార్త వైరల్ అయింది. ఇకపోతే ఇప్పటికే నాలుగవ సీజన్ కి సంబంధించిన కొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక అందులో చిరంజీవి మాత్రం పాల్గొనలేదు అని సమాచారం. ఇక ఎప్పుడూ వైరల్ అవుతున్న ఈ న్యూస్ నిజం అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: