టాలీవుడ్ ,కోలీవుడ్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నిత్యామీనన్.. ఈమె మాట తీరు, డ్రెస్సింగ్ స్టైల్ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో ఏళ్ళు అవుతున్న ఇప్పటివరకు ఎలాంటి గ్లామర్ షో చేయలేదు నిత్యమీనన్. నిత్యామీనన్ తన కెరియర్ లో ఎన్నో పాత్రలలో కూడా నటించింది. పాత్ర నచ్చితే డీ గ్లామరస్ గా నటించడానికి అయినా సరే.. సెకండ్ హీరోయిన్గా నటించడానికి అయినా సరే సిద్ధంగానే ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా తన నటనతో ఆకట్టుకున్న నిత్య మీన మలయాళం, కన్నడ, హిందీ వంటి చిత్రాలలో కూడా నటించింది.


తిరు సినిమాలో నిత్యామీనన్ , ధనుష్ జంటగా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇందులోని నటనకు నిత్యమీనన్ కు కూడా నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. అయితే ఇలాంటి సమయంలోనే నిత్యమీనన్ సోషల్ మీడియాలో ఒక ఫోటోని సైతం పంచుకుంది. అందులో ధనుష్ అండ్ నిత్య టీ గ్లాసులు పట్టుకొని మరి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.దీంతో ఒక కొత్త జర్నీ మొదలయ్యింది అంటూ ఇడ్లీ కడై అని క్యాప్షన్ కూడా జత చేయడం జరిగింది.


అయితే ధనుష్, నిత్యా మీన నటించబోయే సినిమా పేరే ఇడ్లీ కొట్టు అన్నట్లుగా సమాచారం.. అయితే ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించే సినిమా అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ధనుష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం నిత్య మీనన్ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఇడ్లీ కొట్టు సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం అవ్వాలంటే తెలియజేస్తున్నారు. మరి ఈ సినిమా గురించి అటు ధనుష్ గాని నిత్యమీనను గాని ఏ విధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: