స్నేహ రెడ్డి - బన్నీల జంట ఎంత అన్యోన్యంగా ఉంటుందో మనకు బాగా తెలిసిందే. ఇండస్ట్రీలో ఎంతోమంది కపుల్స్ ఉన్నా కూడా ఈ జంటకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా ఇద్దరు యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు.  కాగా బన్నీ - స్నేహారెడ్డిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీళ్లది కులాంతర వివాహం . ఆ విషయం కూడా అందరికీ తెలుసు .


మొదట ప్రేమించుకున్న బన్నీ - స్నేహ రెడ్డి ఆ తర్వాత తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించుకుని మరీ గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు . ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా.. అల్లు అర్హ, అల్లు అయాన్. అల్లు అర్హ ఇండస్ట్రీలో చైల్డ్ యాక్టర్ గా కూడా నటించేసింది . కాగా ఎంతో అన్యోన్యంగా ఉండే స్నేహ రెడ్డి - అల్లు అర్జున్ ల మధ్య జరిగిన ఒక సంభాషణ కి సంబంధించిన విషయాన్ని ఓపెన్ గా చెప్పేసాడు బన్నీ.



"నా పేరు సూర్య నా ఊరు ఇండియా" సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని బయట పెట్టాడు . ఈ సినిమాలో ఒక ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడు  బన్నీ . అయితే ఈ సినిమా షూటింగ్ టైం లోనే బన్నీ సరదాగా స్నేహ రెడ్డికి కాల్ చేసి .."నన్ను నిజంగానే ఆర్మీలో జాయిన్ అవ్వమంటున్నారు ..జాయిన్ అవ్వనా అంటూ అడిగారట. సెకండ్ కూడా ఆలోచించుకోకుండా స్నేహారెడ్డి ఓకే జాయిన్ అవ్వమని చెప్పిందట.  ఒకవేళ నాకు ఏదైనా అయితే ..చచ్చిపోతే.. అంటూ బన్నీ అడగ్గా.. "పోతే పో ఇండియా కోసమేగా ప్రాణమిస్తున్నావ్ నో ప్రాబ్లం.. పిల్లల్ని నేను చూసుకుంటాను" అంటూ ఓపెన్ గానే చెప్పేసిందిట.  ఇది విని అక్కడే ఉన్న డైరెక్టర్ సినిమా టీమ్ మెంబర్స్ కూడా షాక్ అయిపోయారట.  అప్పుడే స్నేహ రెడ్డికి  ఉన్న మంచి మనసు అందరికీ అర్థమైంది . అప్పటి నుంచి స్నేహ రెడ్డి పై జనాలలో డబుల్ రెస్పెక్ట్ పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: