జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనకు బాగా తెలుసు . అందరూ జూనియర్ ఎన్టీఆర్ ని  హీరోలా కాకుండా తమ ఇంటి పెద్ద వ్యక్తిగా ..పెద్ద అన్నగా భావిస్తూ ఉంటారు . అఫ్ కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే ..తనను అభిమానించే అభిమానుల కోసం చాలా జాగ్రత్తలు పడుతూ ఉంటారు . ఏదైనా ఈవెంట్లో కానీ ఫంక్షన్ లో కానీ ఎన్టీఆర్ వస్తే ఎలాంటి హంగామా ఉంటుందో తెలిసిందే.  అయితే అలాంటి హంగామాలో కొన్నిసార్లు అపశృతులు జరుగుతూ ఉంటాయి .

అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ముందుగానే హెచ్చరిస్తారు. " మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంటి దగ్గర మీ అమ్మ నాన్నలు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఎలా అయితే ఇక్కడికి వచ్చారో.. అంతే జాగ్రత్తగా ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్లాలి .. అది గుర్తుపెట్టుకోండి" అంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి . అయితే రీసెంట్గా దేవర ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు తాలూకా వీడియో వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "దేవర".

ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా డెబ్యూ ఇచ్చింది. అయితే ఈ సినిమా అభిమానులను ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.." ఒకానొక మూమెంట్లో చచ్చిపోతానని భయమేసింది అని.. ఆ టైంలో పిల్లలు ,లక్ష్మి ప్రణతి బాగా గుర్తొచ్చారని చెప్పుకు వచ్చారు".  విశ్వక్సేనతో సరదాగా ఓ ఇంటర్వ్యూలకు పాల్గొన్న తారక్ మాట్లాడుతూ .."గోవాలో జరిగిన షూటింగ్లో కొన్ని సీన్స్ షూట్ చేసేటప్పుడు చాలా చాలా ఇబ్బంది పడ్డాను అని.. మరీ ముఖ్యంగా అక్కడ ఉక్కపోతకు నోరు మొత్తం ఎండిపోయింది అని.. ఎంత నీళ్లు తాగిన దాహం తీరలేదు అని ఒకానొక మూమెంట్లో  చచ్చిపోతానేమో అని భయం వేసింది అని ..అప్పుడు లక్ష్మి ప్రణతి పిల్లలు బాగా గుర్తు వచ్చారు అని ..షాట్ కంప్లీట్ అవ్వడం లోపలికి వెళ్లి ఏసి వేసుకొని మరి రిలాక్స్ అయ్యాను అని ..అప్పుడే ప్రాణం పైకి లేచి వచ్చినట్లు అనిపించింది అని " చెప్పుకొచ్చాడు . ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు అభిమానులకి చాలా చాలా ఎమోషనల్ కి గురయ్యేలా చేశాయి.  జూనియర్ ఎన్టీఆర్ అంటే అంత ఇష్టం జనాలకి. అందుకే ఆయన పడిన బాధలు తెలుసుకొని ఎమోషనల్ అయిపోతున్నారు.  ఆ సినిమా ఇంకొంచెం హిట్ అయి ఉంటే బాగుండేది అని అభిప్రాయపడుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: